Minister Chelluboina: తెలంగాణ మంత్రిపై ఏపీ మంత్రి ఫైర్.. అహంకారంతో మాట్లాడటం సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Chelluboina: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్పై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారని.. రాజకీయాలు ఒక వికృత క్రీడగా మారిపోయాయని.. ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడటం అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను తక్షణమే గంగుల కమలాకర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులకు ఇష్టానుసారం మాట్లాడడం అలవాటైపోయిందనిమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also:House EMI: సామాన్యులకు మరో షాక్.. గృహరుణాలపై వడ్డీరేట్లు పెంచిన బ్యాంకులు
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంపై దురహంకార వ్యాఖ్యలు సరికాదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబానికి సజ్జల ఆప్తమిత్రులు అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి నీతి కలిగిన నాయకుడు అని.. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరించే వ్యక్తి అని పేర్కొన్నారు. జగన్ కష్టపడి పనిచేసే ప్రతి పనిదలో సజ్జల ఉంటారన్నారు. ఆంధ్ర ప్రజలపై విష ప్రచారం చేస్తున్నారని.. తక్షణమే ఈ పనిని విరమించుకోవాలన్నారు. ఆంధ్ర ప్రజలపై తెలంగాణ నాయకులు అక్కసు కక్కుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఏదైనా అవసరం వస్తే తెలంగాణ నేతలకు తామే తీర్చాలన్నారు. మున్నూరు కాపులను ఆదుకున్న విశాల హృదయం జగన్ది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పాలనపై దుహంకార వ్యాఖ్యలు సరికావన్నారు. తెలుగువారిగా విడిపోయినా మనసులు విరిగిపోయినట్టు వ్యాఖ్యలు ఉండకూడదన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వలసలు వస్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీ కష్టపూరితంగా రాష్ట్రాన్ని విడదీయడం ద్వారా ప్రజలు ఇబ్బందిపడిన విషయం వాస్తవమన్నారు. ఈ రాష్ట్రం కష్టాల పాలు అవడానికి ప్రతిపక్షనేత చంద్రబాబే కారణమని మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
తాజావార్తలు
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
-
Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
-
Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు ‘భారతీరాజా’
-
Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి