CM Chandrababu : అమరావతికి సరికొత్త వెలుగులు.. 5 ఐకానిక్ టవర్స్..!
- అమరావతి నిర్మాణానికి స్పష్టమైన టైమ్లైన్ ప్రకటించిన సీఎం
- 2028 నాటికి అసెంబ్లీ, హైకోర్టు భవనాల పూర్తి లక్ష్యం
- రాజధానికే తలమానికంగా 5 ఐకానిక్ టవర్లు
- రూ.56 వేల కోట్లతో శరవేగంగా కొనసాగుతున్న పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన రాజధాని పనులను మే 2, 2025న తాము తిరిగి ప్రారంభించామని, ఒక నగరానికి పునాది వేసి, పనులు ఆగిపోయిన తర్వాత మళ్లీ రీస్టార్ట్ చేయడం అనేది చరిత్రలో అమరావతిలోనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 2028 సంవత్సరం నాటికి రాజధానిలోని ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే వీటిని ఘనంగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్కల్యాణ్ విమర్శలు
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పూర్తికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టమైన గడువులను వివరించారు. దీని ప్రకారం, అమరావతిలోని ప్రధానమైన ట్రంక్ రోడ్ల పనులన్నీ మే 27, 2027 నాటికి పూర్తవుతాయి. అలాగే, వివిధ లేఅవుట్ల నిర్మాణాన్ని మే 27, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అత్యంత కీలకమైన అసెంబ్లీ భవనం మే 28, 2028 నాటికి, హైకోర్టు నిర్మాణం జూన్ 20, 2028 నాటికి పూర్తి చేసి సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజధానికే తలమానికంగా నిలిచే ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం ఆగస్టు 4, 2028 నాటికి పూర్తవుతుందని, అదే నెలలో ప్రధానమంత్రి స్వయంగా విచ్చేసి వీటిని ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు.
PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..
పునాది వేయడం, పనులు ఆగిపోయాక మళ్లీ రీస్టార్ట్ చేయడం, చివరకు అదే నాయకుడు ప్రారంభోత్సవం చేయడం వంటి అరుదైన చరిత్రకు అమరావతి వేదిక కాబోతోందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారు 56,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 91 రకాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ క్షేత్రంలో రాత్రింబవళ్లు సుమారు 30,000 మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారని, నిర్ణీత గడువులోగా ప్రపంచ స్థాయి రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!