CM Chandrababu : అమరావతికి సరికొత్త వెలుగులు.. 5 ఐకానిక్ టవర్స్..!
- అమరావతి నిర్మాణానికి స్పష్టమైన టైమ్లైన్ ప్రకటించిన సీఎం
- 2028 నాటికి అసెంబ్లీ, హైకోర్టు భవనాల పూర్తి లక్ష్యం
- రాజధానికే తలమానికంగా 5 ఐకానిక్ టవర్లు
- రూ.56 వేల కోట్లతో శరవేగంగా కొనసాగుతున్న పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన రాజధాని పనులను మే 2, 2025న తాము తిరిగి ప్రారంభించామని, ఒక నగరానికి పునాది వేసి, పనులు ఆగిపోయిన తర్వాత మళ్లీ రీస్టార్ట్ చేయడం అనేది చరిత్రలో అమరావతిలోనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 2028 సంవత్సరం నాటికి రాజధానిలోని ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే వీటిని ఘనంగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్కల్యాణ్ విమర్శలు
Also Read
రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పూర్తికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టమైన గడువులను వివరించారు. దీని ప్రకారం, అమరావతిలోని ప్రధానమైన ట్రంక్ రోడ్ల పనులన్నీ మే 27, 2027 నాటికి పూర్తవుతాయి. అలాగే, వివిధ లేఅవుట్ల నిర్మాణాన్ని మే 27, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అత్యంత కీలకమైన అసెంబ్లీ భవనం మే 28, 2028 నాటికి, హైకోర్టు నిర్మాణం జూన్ 20, 2028 నాటికి పూర్తి చేసి సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజధానికే తలమానికంగా నిలిచే ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం ఆగస్టు 4, 2028 నాటికి పూర్తవుతుందని, అదే నెలలో ప్రధానమంత్రి స్వయంగా విచ్చేసి వీటిని ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు.
PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..
పునాది వేయడం, పనులు ఆగిపోయాక మళ్లీ రీస్టార్ట్ చేయడం, చివరకు అదే నాయకుడు ప్రారంభోత్సవం చేయడం వంటి అరుదైన చరిత్రకు అమరావతి వేదిక కాబోతోందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారు 56,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 91 రకాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ క్షేత్రంలో రాత్రింబవళ్లు సుమారు 30,000 మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారని, నిర్ణీత గడువులోగా ప్రపంచ స్థాయి రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?