PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..
- ఇరాన్ యుద్ధంపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్..
- ఫోన్ కాల్లో చేరిన ఎలాన్ మస్క్..
- దేశాధినేతల కీలక ఫోన్ కాల్లో మస్క్ ఉండటంపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi-Trump call: ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో చర్చించారు. ఇరువురు నేతలు చర్చిస్తున్న సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్లో బిలయనీర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి కాల్లో కనిపించడం అసాధారణం. మంగళవారం అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీల మధ్య ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also: Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?
Also Read
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- Kangana Ranaut: "మంటకు ఆజ్యం పోయవద్దు!" హృతిక్పై విరుచుకుపడిన కంగనా రనౌత్
- CJP: సీజేపీకి రూ.1 కోటి నిధులపై ప్రశ్నలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ కోరిన ఆర్టీఐ కార్యకర్త
ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేని వ్యక్తిని, ఇలాంటి సంఘర్షణ సమయంలో ఫోన్ కాల్లో చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మిడిల్ ఈస్ట్ లో తీవ్రమవుతున్న సంక్షోభంపై ముఖ్యంగా ఇంధన రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణకు సంబంధించి ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఇలాంటి ఒక కీలకమైన కాల్లో సాధారణ పౌరులను చేర్చడం అరుదని, సున్నితమైన జాతీయభద్రతా సమస్యలు చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది.
అయితే, ఈ వ్యవహారంపై భారత్ స్పందించింది. ప్రధాని మోడీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న కాల్లో ఎలాన్ మస్క్ లేడని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. మస్క్ ఉన్నారంటూ వస్తున్న మీడియా నివేదికల్ని భారత్ ఖండించింది. ఈ నెల 24న మోడీ, ట్రంప్ ఇద్దరి మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగినట్లు భారత్ చెప్పింది.
తాజావార్తలు
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!