Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్కల్యాణ్ విమర్శలు
- కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు
- అసెంబ్లీలో పవన్కల్యాణ్ విమర్శలు
- విభజన నాటి పరిణామాలను గుర్తుచేసిన డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ బాధ్యతగా విభజించలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకసారి చంద్రబాబును కలిశానని.. అప్పుడు ఒకే మాట చెప్పారని.. టెంట్ వేసుకునైనా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేద్దామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. అందుకోసమే 2014లో ఎలాంటి కండీషన్స్ లేకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు చేతిలో రాష్ట్రం ఉంటే బాగుంటుందనే సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్లుగా తెలిపారు.
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
‘‘వాస్తవంగా చెప్పాలంటే.. భూ సమీకరణ చేయడమంటే చాలా కష్టం.. చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది రాజధాని కోసం ఎలాంటి గొడవలు లేకుండా భూములు సేకరించారు. అంతేకాకుండా భూమిలిచ్చిన వారందరికీ న్యాయం చేశారు. ఇక 2019లో ప్రభుత్వం మారినప్పుడు రాజధానిపై ఎన్ని అభండాలు వేశారో అందరికీ తెలిసిందే. గత పాలనలో మహిళా రైతులను దారుణంగా కొట్టారని.. ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్లంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. గత పాలనలో ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉండేదని.. చట్టసభల్లోనూ దాడులు జరిగేవని.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకే రక్షణ లేదు.’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదు. తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు అనే భావన మాకు ఎప్పుడూ లేదు. తెలుగు నేల అనే భావన ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేవు. చంద్రబాబు బలమైన ఆశావాది కాబట్టి.. ఆఫీసులు లేకపోయినా పనిచేశారు.’’ అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు
తాజావార్తలు
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!