Chandra Babu: రుషికొండపై జగన్ కన్నుపడితే.. అంతే సంగతులు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గతంలో రుషికొండలోని హరిత రిసార్టును జగన్ సర్కారు కూల్చివేసింది. దీంతో ఆధునీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు రుషికొండ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనను రుషికొండ వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తాళ్లవలసలో బహిరంగ సభలో ఆయన జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్గా ఉండాలని తాను ప్రణాళికలు రచిస్తే.. జగన్ రెడ్డి నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ అవినీతి, అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు. రుషికొండ ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని.. అక్కడ జగన్ కన్నుపడితే అంతే సంగతులు అని ఆరోపించారు. కోడికత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనలతో జగన్ గెలిచారని ఎద్దేవా చేశారు. ఎవరికీ రాని ఆలోచనలు జగన్కు వస్తుంటాయని.. ఏపీలో వైసీపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా తయారయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక వాళ్లందరి తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని ఆటకెక్కించారని.. అగ్రిగోల్డ్ భూములను కొట్టేయడానికి పన్నాగం పన్నారని విమర్శలు చేశారు. జగన్ అమలు చేస్తున్న బాదుడే బాదుడుకు టీడీపీ ఒక్కటే విరుగుడు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. జగన్ను నమ్ముకున్న ఐఏఎస్ అధికారులు జైలు పాలవుతున్నారని, సీఎం కారణంగా 8 మంది అధికారులు జైలు శిక్షకు గురయ్యారని గుర్తుచేశారు.
Also Read
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
విశాఖపట్నం జిల్లాలోని తాళ్లవలసలో తమ ప్రియతమ నేతను చూసేందుకు ప్రేమతో, స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు వీళ్ళు. చంద్రబాబు గారితో మాట్లాడేందుకు, ఆయన పంచిన కొవ్వొత్తులు అందుకుని వెలిగించేందుకు ప్రజలు పోటీపడ్డారు. (1/3) pic.twitter.com/2VsNFYr9jk
— Telugu Desam Party (@JaiTDP) May 5, 2022
తాజావార్తలు
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!