Chandra Babu: రుషికొండపై జగన్ కన్నుపడితే.. అంతే సంగతులు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గతంలో రుషికొండలోని హరిత రిసార్టును జగన్ సర్కారు కూల్చివేసింది. దీంతో ఆధునీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు రుషికొండ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనను రుషికొండ వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తాళ్లవలసలో బహిరంగ సభలో ఆయన జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్గా ఉండాలని తాను ప్రణాళికలు రచిస్తే.. జగన్ రెడ్డి నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ అవినీతి, అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు. రుషికొండ ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని.. అక్కడ జగన్ కన్నుపడితే అంతే సంగతులు అని ఆరోపించారు. కోడికత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనలతో జగన్ గెలిచారని ఎద్దేవా చేశారు. ఎవరికీ రాని ఆలోచనలు జగన్కు వస్తుంటాయని.. ఏపీలో వైసీపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా తయారయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక వాళ్లందరి తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని ఆటకెక్కించారని.. అగ్రిగోల్డ్ భూములను కొట్టేయడానికి పన్నాగం పన్నారని విమర్శలు చేశారు. జగన్ అమలు చేస్తున్న బాదుడే బాదుడుకు టీడీపీ ఒక్కటే విరుగుడు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. జగన్ను నమ్ముకున్న ఐఏఎస్ అధికారులు జైలు పాలవుతున్నారని, సీఎం కారణంగా 8 మంది అధికారులు జైలు శిక్షకు గురయ్యారని గుర్తుచేశారు.
Also Read
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
విశాఖపట్నం జిల్లాలోని తాళ్లవలసలో తమ ప్రియతమ నేతను చూసేందుకు ప్రేమతో, స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు వీళ్ళు. చంద్రబాబు గారితో మాట్లాడేందుకు, ఆయన పంచిన కొవ్వొత్తులు అందుకుని వెలిగించేందుకు ప్రజలు పోటీపడ్డారు. (1/3) pic.twitter.com/2VsNFYr9jk
— Telugu Desam Party (@JaiTDP) May 5, 2022
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..