Ambati Rambabu: చంద్రబాబే ఆ ప్రాజెక్ట్కి నష్టం కలిగించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని పరిష్కరించిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం అవుతుందని అన్నారు. ప్రపంచంలో, దేశంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సందర్భాలు ఏవీ లేవని, ఒక్క పోలవరం విషయంలో మాత్రం ఇలా జరిగిందని తెలిపారు. ఆ వాల్ పునర్నిర్మాణం చేసే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావడంతో, వ్యయం మరింత పెరుగుతుందని వెల్లడించారు. అవగాహన లోపం, ఏదో చేయాలనే తాపత్రయంతో చంద్రబాబు ఈ ప్రాజెక్ట్కి నష్టం కలిగించారని ఆరోపించారు.
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
కాగా.. గురువారం ఉదయమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న అంబటి రాంబాబు స్పిల్ వే మీద ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.ఎస్.నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఆర్డీవో ఝాన్సి రాణీ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..