Telangana to Pay Power Dues: జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది. సీఎం జగన్ వినుతల పైన ప్రధాని ఈ సారి వేగంగా స్పందించి, సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. సుదీర్ఘ కాలంగా ఏపీకి దక్కాల్సిన బకాయిల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ డిస్కమ్ ల నుంచి ఏపీకి బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.. ఇదే అంశం పైన గతంలో పలు మార్లు కేంద్రానికి ఏపీ నివేదించినా, అయినా, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాలేదు.
ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ సమయంలో చర్చించిన అంశాల పైన ఈ సారి వెంటనే స్పందించింది పీఎంఓ, ఏపీకి సంబంధించిన అంశాల పైన అధికారుల కమిటీకి బాధ్యతలు అప్పగించటంతో పాటు, తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఈ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం 30 రోజుల సమయం కేటాయించింది. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్లకు ఏపీ జెన్కో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేసింది. దీంతో.. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు ఉండిపోయాయి. అయితే.. నీతి అయోగ్ సమావేశం, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాలతో పాటుగా ప్రధానితో సీఎం సమావేశమైన అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి, పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఈనేపథ్యంలో.. ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ సూచించారు. దీంతో.. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే.. చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ వాదిస్తోంది. దీంతో.. ఈ నెల 22న సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర ఇంధన శాఖ మంత్రితో సమావేశమైన ఆయన ఈ విషయం పైన పట్టుబట్టారు. దీంతో.. కేంద్రం నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో.. ఇప్పుడు ఈ ఆదేశాల పైన తెలంగాణ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Lift Fight : సాయానికి పోతే పాపం ఎదురైందంట.. ఇదే మరీ..!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?