Balineni Srinivasa Reddy: చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy Comments On Chandrababu Manifesto: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని కొత్త మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క పథకం కూడా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం జగన్ ఏదైనా పథకాన్ని ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారు కానీ, చంద్రబాబును ఎవ్వరూ నమ్మరని దుయ్యబట్టారు. గతంలో చేసిన 600 వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వివాదంపై స్పందిస్తూ.. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపి, వైసీపీ వాళ్లే దౌర్జన్యం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు చింపింది జనసేన కార్యకర్తలేని అందరికీ తెలుసన్న ఆయన.. ఈ ఘటనలపై తాము సామరస్యంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.
Minister Mallareddy: ఏం ముఖం పెట్టుకుని వాళ్లు ఓట్లడుగుతారు..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఇదే సమయంలో.. మంత్రి గుమ్మనూరు జయరాం సైతం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ప్రజలు నమ్మరని.. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. 2024లో టీడీపీ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించడానికి చంద్రబాబు అనర్హులని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మళ్లీ జగనన్నే సీఎం అవుతారని, టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదని మంత్రి జయరాం తేల్చి చెప్పారు.
Kidnap: కళ్ల ముందే కూతురు కిడ్నాప్.. తట్టుకోలేక రైలుకిందపడి పేరెంట్స్ ఆత్మహత్య
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!