Balineni Srinivasa Reddy: చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy Comments On Chandrababu Manifesto: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని కొత్త మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క పథకం కూడా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం జగన్ ఏదైనా పథకాన్ని ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారు కానీ, చంద్రబాబును ఎవ్వరూ నమ్మరని దుయ్యబట్టారు. గతంలో చేసిన 600 వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వివాదంపై స్పందిస్తూ.. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపి, వైసీపీ వాళ్లే దౌర్జన్యం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు చింపింది జనసేన కార్యకర్తలేని అందరికీ తెలుసన్న ఆయన.. ఈ ఘటనలపై తాము సామరస్యంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.
Minister Mallareddy: ఏం ముఖం పెట్టుకుని వాళ్లు ఓట్లడుగుతారు..
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఇదే సమయంలో.. మంత్రి గుమ్మనూరు జయరాం సైతం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ప్రజలు నమ్మరని.. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. 2024లో టీడీపీ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించడానికి చంద్రబాబు అనర్హులని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మళ్లీ జగనన్నే సీఎం అవుతారని, టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదని మంత్రి జయరాం తేల్చి చెప్పారు.
Kidnap: కళ్ల ముందే కూతురు కిడ్నాప్.. తట్టుకోలేక రైలుకిందపడి పేరెంట్స్ ఆత్మహత్య
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!