Minister Mallareddy: ఏం ముఖం పెట్టుకుని వాళ్లు ఓట్లడుగుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికలతో బీజేపీ పనైపోయింది..
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంలో ఉన్నారు. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తున్నా తెలంగాణ రాష్ట్రం మాత్రం అన్ని రాష్ట్రాలకు మోడల్ గా నిలుస్తోంది అని ఆయన కామెంట్స్ చేశారు.
Also Read : Kidnap: కళ్ల ముందే కూతురు కిడ్నాప్.. తట్టుకోలేక రైలుకిందపడి పేరెంట్స్ ఆత్మహత్య
Also Read
కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఉన్నాయా అంటూ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. వాళ్లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు అంటూ అడిగారు. ఓట్లడిగే కాంగ్రెస్ నేతలను చీపుర్లతో కొట్టండి అని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు తన మాటలనే సెన్సేషన్ డైలాగ్ గా మారుస్తూ.. నిత్యం ప్రజలతో మంత్రి మల్లారెడ్డి మమేకమవుతున్నారు.
Also Read : Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..
నిజామాబాద్ లో మాయమాటలు విని బీజేపీని గెలిపించుకొన్నారు.. కానీ వచ్చే ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా కవితను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను మంత్రి మల్లారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అందరూ ఆనందంగా ఉన్నారన్న మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి తెలంగాణలో ఉందని తెలిపారు.
Also Read : JD Chakravarthy : వార్నీ.. జేడి చక్రవర్తి ఆ టైపా.. ఒక్కరిని కూడా వదల్లేదా?
బీజేపీ అధికారంలో ఉన్న 17 రాష్ట్రాలలో తెలంగాణ లాంటి అభివృద్ధి ఎక్కడా లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దళిత బంధు, 24 గంటల విద్యుత్, గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనేలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలలో అధికారం కైవసం చేసుకుంటానని పగటి కలలు కంటున్నాడని మల్లారెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగితే చీపురులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచే 10 మంది పేర్లను చెప్పలేని పరిస్థితిలో ఉంది.. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అడిగారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!