Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Speaker Tammineni Sitaram Slams Amaravathi Farmers Padayatra

Tammineni Sitaram: అది రైతుల యాత్ర కాదు.. బినామీ యాత్ర

Published Date :October 23, 2022 , 12:50 pm
By Ramesh Nalam
Tammineni Sitaram: అది రైతుల యాత్ర కాదు.. బినామీ యాత్ర
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tammineni Sitaram: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది రైతుల యాత్ర కాదని.. బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70 మందే పట్టుకుని వచ్చారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఇది డ్రామా కాదా.. ఎవడి డ్రామా అని నిలదీశారు. ఐడీ కార్డులు చుపమంటే కళ్యాణమండపం నుంచి బయటకురాలేదని.. చంద్రబాబు ఒక హిడెన్ ఎజెండాతో ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు.

ప్రపంచ రాజధాని అంటున్న చంద్రబాబుకు విశాఖ ఎందుకు గుర్తురాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూటి ప్రశ్న వేశారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయన్నారు. ఒకటికి వెయ్యి రెట్లు భూముల రేటు పెంచాలనే ఇన్ సైడర్ ట్రేడ్ చేసి అమరావతిలో రాజధాని పెట్టారని ఆరోపించారు. రాష్ర్టంలో ప్రజలందరికీ, అన్ని వర్గాలకు రాజధాని అందుబాటులో ఉండాలన్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే సెంటర్లీ లొకేటెడ్ అంటున్నారని.. పోనీ అమరావతి కట్టారా అంటే గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. శివరామకృష్ణ రిపోర్టు, శ్రీభాగ్ ఒప్పందాలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు.

Also Read

  • CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
  • Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
  • AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు

Read Also: Minister Slaps Woman: మహిళను చెంపదెబ్బ కొట్టిన మంత్రి.. వీడియో వైరల్..

అమరావతి ప్రాంతం రాజధాని పనికిరాదని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ జగన్ వేసిన కమిటీ కాదని.. కేంద్రప్రభుత్వం వేసిన కమిటీ అన్నారు. బ్యాంకులు దోచిన వారిని, విద్యను వ్యాపారం చేసిన వారిని చంద్రబాబు కమిటీలో వేశారని తమ్మినేని చురకలు అంటించారు. హైదరాబాద్ రాజధానిని ఎందుకు వదిలి అదరా బాదరాగా వచ్చేశారని ప్రశ్నించారు. అమరావతిని మేం రాజధాని కాదనటం లేదని.. కర్నూలు, విశాఖ కుడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ర్యాలీ చేయమని హైకోర్టు అనుమతి ఇస్తే.. తొడలు కొట్టడానికి.. రెచ్చగొట్టడానికి ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం సర్వత్రా ఆమోదయోగ్యమన్నారు. ఇక్కడ జరిగిన ఉద్యమాలు ఎవరి కోసం, ఎందుకోసం జరిగాయో అందరికీ తెలుసన్నారు.

ఉత్తరాంధ్ర పొరాటంలో నాడు ఎందరో మేథావులు త్యాగాలు చేశారని.. నాడు ఎందరో మహానేతలు చేసిన ప్రాణత్యాగాలకు జగన్ న్యాయం చేయాలనుకుంటున్నారని తమ్మినేని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నాడు భుస్వామ్య వ్యవస్థపై తిరగబడిందే సిక్కోల సాయుధ పోరాటం అన్నారు. నాటి పోరాటానికి కారణం పేదరికం , వెనుకుబాటుతనం అని గుర్తుచేశారు. నాయకుడు అంటే ఒక సామాజిక వర్గం కోసం కాదు సమాజం కోసం పనిచేయాలన్నారు. చంద్రబాబు మెకానిజం ఎవరిని మభ్యపెట్టడానికో చెప్పాలన్నారు. పండగ వస్తే ఉత్తరాంధ్ర వాసులు ఎక్కడికో వలస వెళ్లి తిరిగి వస్తుంటారని.. ఎన్నాళ్లు ఈ దుర్ఘతి.. దౌర్భాగ్యం ఉంటాయని.. ఎన్నాళ్లు ఈ అవస్థలు పడాలని తమ్మినేని ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amaravathi padayatra
  • Andhra Pradesh
  • ap politics
  • chandrababu
  • tammineni sitaram

తాజావార్తలు

  • CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!

  • Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?

  • Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్‌మేట్స్’ సిరీస్ రివ్యూ

  • Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!

  • Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions