సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అపోహలు ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు.. పదేళ్లుగా టీడీపీ ఇదే మైండ్ సెట్తో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమీక్ష, కోవిడ్ నేపథ్యంలో పరిస్థితులను వివరించడానికి ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తుంటారు.. ఈ పర్యటనలు ఒక్కోరోజు వాయిదా కూడా పడుతుంటాయి.. కానీ, కేసుల గురుంచి మాట్లాడడం కోసమే వెళ్తున్నారంటూ.. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏదో అపోహలు సృష్టించడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇది ఇప్పటిది కాదు, వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఢిల్లీ వెళ్లినా ఇదే అత్యుత్సాహం ఉండేది, ఎందుకో అర్థం కాదన్నారు.
ఇక, అద్దె ఆధారిత పన్ను విధానంలోపభూయిష్టంగా ఉండడం వల్లే విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్నే అమలు చేస్తున్నాయన్న ఆయన.. నూతన ఆస్తిపన్ను విధానం వల్ల వందల కోట్ల భారం అన్నట్లు ప్రచారం జరుగుతోంది, ఇది అవాస్తవం అన్నారు.. లోపాలు సరిదిద్ది, అందరికీ ఒకే పన్ను విధానం అమలు చేయడం అనేది ప్రధాన లక్ష్యం, దీనివల్ల కేవలం 186 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ప్రభుత్వానికి దక్కనుందన్నారు.. ప్రస్తుతం వసూలు చేస్తున్న దానిపైన ఆస్తి పన్ను 15 శాతం మించ కుండా కొత్త పన్ను విధానం ఉండాలని సీఎం నిర్ధేశించారి తెలిపారు మంత్రి బొత్స.
Also Read
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!