సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అపోహలు ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు.. పదేళ్లుగా టీడీపీ ఇదే మైండ్ సెట్తో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమీక్ష, కోవిడ్ నేపథ్యంలో పరిస్థితులను వివరించడానికి ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తుంటారు.. ఈ పర్యటనలు ఒక్కోరోజు వాయిదా కూడా పడుతుంటాయి.. కానీ, కేసుల గురుంచి మాట్లాడడం కోసమే వెళ్తున్నారంటూ.. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏదో అపోహలు సృష్టించడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇది ఇప్పటిది కాదు, వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఢిల్లీ వెళ్లినా ఇదే అత్యుత్సాహం ఉండేది, ఎందుకో అర్థం కాదన్నారు.
ఇక, అద్దె ఆధారిత పన్ను విధానంలోపభూయిష్టంగా ఉండడం వల్లే విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్నే అమలు చేస్తున్నాయన్న ఆయన.. నూతన ఆస్తిపన్ను విధానం వల్ల వందల కోట్ల భారం అన్నట్లు ప్రచారం జరుగుతోంది, ఇది అవాస్తవం అన్నారు.. లోపాలు సరిదిద్ది, అందరికీ ఒకే పన్ను విధానం అమలు చేయడం అనేది ప్రధాన లక్ష్యం, దీనివల్ల కేవలం 186 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ప్రభుత్వానికి దక్కనుందన్నారు.. ప్రస్తుతం వసూలు చేస్తున్న దానిపైన ఆస్తి పన్ను 15 శాతం మించ కుండా కొత్త పన్ను విధానం ఉండాలని సీఎం నిర్ధేశించారి తెలిపారు మంత్రి బొత్స.
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!