Heat waves: బిగ్ అలర్ట్.. ఈ మండలాల ప్రజలు జాగ్రత్త
- ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు బిగ్ అలర్ట్
- రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండాకాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం (12-03-25) కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు, శ్రీకాకుళం జిల్లా బూర్జ, లక్ష్మీనరసుపేట, హీరామండలం, విజయనగరం జిల్లా బొబ్బివి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు (19) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Also Read:Robinhood: నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు:
శ్రీకాకుళం జిల్లా-18, విజయనగరం-21,పార్వతీపురం మన్యం-3, అల్లూరి సీతారామరాజు-12, అనకాపల్లి-13, కాకినాడ-18, కోనసీమ-11, తూర్పుగోదావరి-19,పశ్చిమగోదావరి-4, ఏలూరు-16, కృష్ణా-10, గుంటూరు-14, బాపట్ల-3, పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. గురువారం 53 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
Also Read:Robinhood: నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 39°C, పార్వతీపురంమన్యం జిల్లా కురుపాంలో 39°C, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 38.7°C, నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో 38.7°C, విజయనగరం జిల్లా నెలివాడలో 38.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు వీచాయని అన్నారు.
Also Read:Sai Pallavi : చీరకట్టులో సాయిపల్లవి డ్యాన్స్.. ఎంత ముచ్చటగా ఉందో
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!