వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం: మూడో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్ …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని సర్కార్ విడుదల చేసింది. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న మాట ఇచ్చామని.. ఆటోడ్రైవర్లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బాదుడు ఎక్కువైంది, పెనాల్టీలు ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందారని.. అప్పులు తెచ్చి ఇన్సూరెన్స్, మరమ్మతులు, పెనాల్టీలు కడుతున్నామని చెప్పారని వెల్లడించారు. వారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైయస్సార్వాహన మిత్రను ప్రారంభించామని.. ఈ ఏడాది 2,48,468 మందికి రూ. 248.47 కోట్లు లబ్ధి చేకూరనుందన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో విడత కార్యక్రమంతో కలుపుకుంటే అక్షరాల రూ. 759 కోట్ల రూపాయలు జమచేశామని.. ఒక్కొక్కరికి రూ.30వేల రూపాయల సహాయం అందించామని తెలిపారు. ఈ ఏడాదిలో 42,932 మందికి అదనంగా లబ్ధి జరుగనుందని.. వాహనమిత్ర కింద లబ్ధి పొందుతున్న వారిలో 84 శాతం మంది ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఉన్నారన్నారు.
Also Read
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Tags
- ap
- cm jagan
- vahanamitra
తాజావార్తలు
-
TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!
-
Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..
-
Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
-
Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
-
China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!