Somu Veerraju: ఏపీ పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతిలో బీజేపీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మనం – మన అమరావతి’ పేరుతో బీజేపీ పాదయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుందని విజయసాయిరెడ్డి చెప్తున్నారని.. నిజంగానే ఏపీ పరిస్థితి బాగుంటే అప్పుల కోసం రోజూ ఎందుకు పరిగెడుతున్నారని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధానిని ఎందుకు కట్టడం లేదని అడిగారు.
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మోసం చేయలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలను కూడా కేంద్రమే నిర్మిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ చెపుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఆర్ అండ్ ఆర్ నివేదికను కేంద్రానికి రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాకూడదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా చేసింది వైసీపీనే అని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ మేల్కొని రాజధాని అమరావతిలో వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. తాము రాజధాని నిర్మాణం కోసం రూ.8,500 కోట్లు ఇచ్చామని.. చంద్రబాబు సగం రాజధాని కట్టి ఉంటే ఇలా అయ్యేది కాదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తాము ఏం తప్పు చేశామని చంద్రబాబు తమను వదిలేశాడని సోము వీర్రాజు ప్రశ్నించారు.
Also Read
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
- Eluru Tragedy: ఏలూరు జిల్లాలో విషాదం.. జీడి మామిడి తోటలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి!
Read Also: CM Jagan Mohan Reddy: చంద్రబాబు హయాంలో డీపీటీ ఉండేది.. కానీ మా హయాంలో డీబీటీ ఉంది
అటు అమరావతిలో పాదయాత్ర చేస్తున్న సోము వీర్రాజును పలువురు రైతులు ప్రశ్నించారు. ఒకే రాజధాని అమలయ్యేలా మీరు ఏం చేస్తారని కొందరు రైతులు సూటిగా అడిగారు. ఒకే రాజధాని అని చెప్పడమేనా.. బీజేపీ ఏమైనా చేస్తుందా అని నిలదీశారు. అమరావతికి మోడీ శంకుస్థాపన చేసి వెళ్లాడు.. ఆరోజు నుంచి ఈ రోజు వరకు కలలు కంటూనే ఉన్నామని.. ఇంతలో జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నాడని.. జగన్, బీజేపీ ఒక్కటేనని రైతులు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!