Andhra Pradesh: సత్తా చాటిన ఏపీ.. మరోసారి నెంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.. దాని ప్రకారం.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్.. 97.89 శాతం స్కోర్ తో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. 97.77 శాతం స్కోర్ తో గుజరాత్ రెండో స్థానంలో ఉంది.. ఇక, 96.97 శాతంలో తర్వాత స్థానంలో తమిళనాడు.. 94.86 శాతంతో నాల్గో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.. టాప్ అచివర్స్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి..
Read Also: Chandrababu: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా..? చంద్రబాబు ఫైర్
Also Read
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. టాప్ అచీవర్స్లో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకుంది.. అయితే, గతంలో ఎన్నడూ లేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.. 10,200 మంది పెట్టుబడిదారులు, స్టేక్ హోల్డర్ల నుండి అభిప్రాయాలు సేకరించింది.. అయితే, అన్ని రంగాల్లోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తమైనట్టుగా చెబుతున్నారు.. మొత్తం 4 క్యాటగిరీల్లో రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది కేంద్రం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 97.89 శాతం స్కోర్తో ఏపీ మొదటి స్థానంలో నిలిస్తే.. గుజరాత్ 97.77 శాతం, తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతంతో వరుస స్థానాల్లో నిలిచాయి.. రెండో జాబితాలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు 80-90 శాతం స్కోర్తో ఉన్నాయి. అలాగే అసోం, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 50 నుంచి 80 శాతం స్కోరుతో మూడో జాబితాలో ఉండగా.. ఢిల్లీ, బీహార్, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు 50 శాతం కంటే తక్కువ స్కోర్ చేశాయి.
తాజావార్తలు
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!