అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రకాశం జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లా కొత్త పట్నంలో సముద్ర తీరం 15 మీటర్లు ముందు కొచ్చింది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో చినగంజాం, సింగరా యకొండ, వేటపాలెం, కందూకూరు తదితర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ అయి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునారావస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, వైద్యా ఆరోగ్య శాఖ అధికారులను సైతం అలర్ట్ చేశారు. మత్స్య కారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం సూచిం చింది. ఈ అల్ప పీడనంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరో రెండు రోజులు అల్ప పీడనం కొనసాగే అవకాశం ఉందన్నారు. దీంతో దక్షిణ కోస్తా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.