AP Govt: ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
- ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు.. రాష్ట్రస్థాయిలో ఏపీ సీఎస్ చైర్మన్ గా.. జిల్లా స్థాయిలో కలెక్టర్ చెర్మన్ గా కమిటీలు..
- రాష్ట్రస్థాయి కమిటీలో 21 మంది జిల్లాస్థాయిలో 17 మంది సభ్యులు..
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోధరల స్ధిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్ధాయిలో కలెక్టర్ చైర్మన్ గానూ కమిటీలను ఏర్పాటు చేసినట్లు సర్కార్ వెల్లడించింది. రాష్ట్ర స్ధాయి కమిటీలో 21 మంది సభ్యులు, జిల్లా స్థాయిలో 17 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ కమిటీలు ధరల స్ధిరీకరణకు కావాల్సిన అంశాలను ప్రభుత్వానికి సూచించనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం అంశంలో ఈ కమిటీలు కీలక సూచనలిస్తాయి. కాగా, సమస్యలపై స్పందించడానికి కావాల్సిన విధి విధానాలను సైతం ప్రభుత్వానికి ఈ కమిటీలు సూచనలు చేయనున్నాయి. రాష్ట్ర స్ధాయి కమిటీ పాలసీ సంబంధిత అంశాలను సూచిస్తుంది. రాష్ట్ర స్ధాయి కమిటీలో సంబంధిత శాఖల సెక్రటరీలు, తూనికలు కొలతల అధికారులు సైతం ఉంటారు.
Read Also: Piles home remedies: ఇంటి పక్కనే దొరికే ఈ ఆకులను నమిలితే చాలా.. పైల్స్ సమస్యకు చెక్!
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
మరోవైపు రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ చేస్తున్నారు. ఈ దీపం పథకానికి సంబంధించి ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్కార్డు అర్హులుగా చెప్పుకొచ్చింది సర్కార్. రేపు (అక్టోబర్ 31)వ తేదీన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే ఒక మెసేజ్ కస్టమర్ ఫోన్ నంబర్కు వెళుతుంది.. అలాగే, బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయనున్నారు. బుక్ చేసిన సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తామని ఏపీ సర్కార్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో