AP Govt: ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
- ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు.. రాష్ట్రస్థాయిలో ఏపీ సీఎస్ చైర్మన్ గా.. జిల్లా స్థాయిలో కలెక్టర్ చెర్మన్ గా కమిటీలు..
- రాష్ట్రస్థాయి కమిటీలో 21 మంది జిల్లాస్థాయిలో 17 మంది సభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోధరల స్ధిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్ధాయిలో కలెక్టర్ చైర్మన్ గానూ కమిటీలను ఏర్పాటు చేసినట్లు సర్కార్ వెల్లడించింది. రాష్ట్ర స్ధాయి కమిటీలో 21 మంది సభ్యులు, జిల్లా స్థాయిలో 17 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ కమిటీలు ధరల స్ధిరీకరణకు కావాల్సిన అంశాలను ప్రభుత్వానికి సూచించనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం అంశంలో ఈ కమిటీలు కీలక సూచనలిస్తాయి. కాగా, సమస్యలపై స్పందించడానికి కావాల్సిన విధి విధానాలను సైతం ప్రభుత్వానికి ఈ కమిటీలు సూచనలు చేయనున్నాయి. రాష్ట్ర స్ధాయి కమిటీ పాలసీ సంబంధిత అంశాలను సూచిస్తుంది. రాష్ట్ర స్ధాయి కమిటీలో సంబంధిత శాఖల సెక్రటరీలు, తూనికలు కొలతల అధికారులు సైతం ఉంటారు.
Read Also: Piles home remedies: ఇంటి పక్కనే దొరికే ఈ ఆకులను నమిలితే చాలా.. పైల్స్ సమస్యకు చెక్!
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
మరోవైపు రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ చేస్తున్నారు. ఈ దీపం పథకానికి సంబంధించి ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్కార్డు అర్హులుగా చెప్పుకొచ్చింది సర్కార్. రేపు (అక్టోబర్ 31)వ తేదీన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే ఒక మెసేజ్ కస్టమర్ ఫోన్ నంబర్కు వెళుతుంది.. అలాగే, బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయనున్నారు. బుక్ చేసిన సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తామని ఏపీ సర్కార్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!