ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూడండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తోన్న ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చర్చల ద్వారా సమ్మెకు వెళ్లకుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు.
ఆర్ధికశాఖ అధికారులు, జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించిన సీఎస్ సమీర్ శర్మ.. ఈసందర్భంగా ఉద్యోగులంటే మనంతా ఒక కుటుంబమని ఏదైనా సమస్య వస్తే కూర్చుని అంతర్గంతంగా చర్చించు కుందామని చెప్పిజిల్లా కలక్టర్లు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిపి మట్లాడి ఒప్పించాలని చెప్పారు.. మనం అందరం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో భాగమని మన మెరుగైన సేవలు ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులుగా మనకు ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగం ఉందని ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఉద్యోగులు సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ప్రతి ఉద్యోగి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ తదిపరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్ళాలనుకునే విద్యార్ధులు, ఆసుపత్రుల నుండి బయటికి వచ్చే కరోనా రోగుల పరిస్థితులను, కోవిడ్ ఇబ్బందుల నుండి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వ్యాపార వాణిజ్య కార్య కలాపాలకు ఏవిధంగా ఇబ్బందులు కలుగుతాయో ఉహించుకోవాలని సీఎస్ ఉద్యోగులకు సూచించారు. ప్రభుత్వం మీవెంటే ఉందనే విషయాన్నిఉద్యోగులకు తెలియజేసి అందరూ కలిసి పని చేద్దామని సమస్యలుంటే చర్చలు ద్వారా పరిష్కరించు కుందామని తెలియజేయాలని జిల్లా కలక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. కేవలం చర్చలు ద్వారానే అన్ని విషయాలు పరిష్కారం అవుతాయని కావున ఆదిశగా ఉద్యోగ సంఘాలను చైతన్యపర్చి ఆందోళన విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!