Kethireddy Pedda Reddy: ఆ మాట చెబితే.. నేను జేసీ ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతా..!
- తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి..
- మీడియా సమావేశంలో కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
- నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు చెబితే..
- వారి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతానన్న పెద్దారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి.. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతానని వ్యాఖ్యానించారు..
Read Also: Florida: విమానంలో పిల్లల ముందే జంట రోమాన్స్.. ఎంత చెప్పినా ఆపకపోవడంతో..
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను, ఆయన కుటుంబ సభ్యులను ఏనాడూ దూషించలేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అయితే, నేను ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం అన్నారు.. మరోవైపు, నా కోడలు తాడిపత్రి వైసీపీ సమావేశంలో పాల్గొంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం ఏం సంస్కారం? అంటూ మండిపడ్డారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఏం కేసులు ఉన్నాయో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లిస్ట్ తెప్పించుకోవాలని సూచించిన ఆయన.. జేసీ ప్రభాకర్ రెడ్డికి న్యాయం చేయాలంటే… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వల్లే అవుతుందన్నారు.. ఇక, సుప్రీంకోర్టు నిషేదించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి జేసీ ట్రావెల్స్ లో తిప్పారని విమర్శించారు.. జేసీ ట్రావెల్స్ లో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నందున జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు అయ్యాయని వివరించారు.. అంతేకానీ, జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఉన్న కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగం కాదన్నారు.. తాడిపత్రి ఏఎస్పీ, అనంతపురం డీపీవోలను జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించటం దుర్మార్గం అన్నారు.. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ అవినీతి పరుడు అంటూ జేసీ విమర్శలు చేశారు.. అవినీతి డబ్బు జేసీ ఇంటికి చేరినందుకే తాడిపత్రిలో ఏఎస్పి కార్యాలయం ముందు, యాడికి లో రైతులతో చేస్తానన్న ధర్నా విరమించుకున్నారా? అని నిలదీశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..
తాజావార్తలు
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!