AP Crime: అన్నంత పని చేసింది..! వారం రోజుల శిశువును అమ్మేసిన తల్లి..
- అనంతపురం జిల్లాలో దారుణం..
- మానవత్వం మంట గలిపిన తల్లి..
- వారం రోజుల శిశువును విక్రయించిన తల్లి..
AP Crime: మానవత్వం మంట గలిపి మానవ సంబంధాలకు విలువలు లేకుండా సభ్యసమాజంలో చివరకు శిశువును సైతం విక్రయించే దారుణానికి ఒడిగట్టారు. దత్తత పేరుతో శిశువును కొనుగోలు చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామానికి చెందిన బళ్లారి రూపమ్మకు 15 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. ఆమెకు అంతకు ముందు ఆరేళ్ల బాలిక కూడా ఉంది. కుటుంబ కలహాలతో భర్తతో కాకుండా రాయదుర్గంలో ఒంటరిగా జీవిస్తుంది. ఈమె గర్భవతిగా ఉన్నపుడే ఆమె రాయదుర్గం పట్టణ శివారులో ఒంటరిగా ఉండేది. అప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆమె ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్సలు అందించారు.
Read Also: Srilanka : ప్రశాంతంగా కొనసాగుతున్న శ్రీలంక అధ్యక్షుడు ఎన్నికల పోలింగ్
Also Read
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
- ACB court: అవినీతి అధికారికి ఏడేళ్లు జైలు, రూ.2 లక్షల జరిమానా
అయితే, అప్పటి నుంచి తనకు పుట్టే సంతానాన్ని అమ్మేస్తానంటూ చెబుతూ వచ్చేది. దీంతో ఆమె బంధువులకు, కుటుంబీకులకు సమాచారం అం దించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆమె ప్రసవించేదాకా పర్యవేక్షిస్తూ వచ్చారు. అంతిమంగా మగశిశువును 15 రోజుల క్రితం జన్మనిచ్చింది. కాగా ఆమెకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆమె జన్మనిచ్చిన మగశిశువు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. అందులో భాగంగా శుక్రవారం ఆమె ఉన్న ఇంటి వద్దకు వెళ్లి శిశువు గురించి ఆమెను ఆరా తీశారు. కానీ వారం క్రితమే ఆమె శిశువును రూ. 80 వేలకు ఆమె విక్రయించేసినట్లు వెల్లడించింది. దీనిపై అప్రమత్తమైన సిబ్బంది పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా, రాయదుర్గం పట్టణానికి చెందిన ఎరుకుల రాజశేఖర్కు దత్తత ఇచ్చినట్లు పత్రాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించి శిశువును ఎక్కడ ఉంచారన్న విషయంపై గాలించాలని కోరడంతో రాజశేఖర్ను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. అతని సమీప బంధువులకు సంతానం లేకపోవడంతో వారి వద్ద ఉన్నట్లు తెలిపారు. శిశువును వెంటనే స్టేషన్కు తీసుకురావాలని ఆదేశించడంతో హుటాహుటిన తీసుకొచ్చి ఐసీడీఎస్ సీడీపీవో పద్మావతికి అప్పగించారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితిపై వైద్యశాలలో పరీక్షలు చేయించి స్వాధీనం చేసుకున్నారు. శిశువును నేరుగా దత్తత ఇవ్వడం కుదరదని తల్లి రూపమ్మకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఆరోగ్యం సరిగ్గా లేదని తన తదనంతరం తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే కారణంతో వారికి అప్పగించినట్లు ఆమె చెప్పింది. సంతృప్తి చెందని అధికారులు ఆమె ప్రవర్తనపై తీవ్ర అనుమానాలు ఉండడంతో శిశువును శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?