YS Jagan: నేడు తెనాలికి వైఎస్ జగన్.. మాజీ సీఎం పర్యటనపై విమర్శలు..
- నేడు గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన..
- పోలీసుల చేతిలో లాఠీదెబ్బలు తిన్న జాన్ విక్టర్కు పరామర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.. ఇటీవల పోలీసుల చేతిలో లాఠీదెబ్బలు తిన్న జాన్ విక్టర్ను పరామర్శించనున్నారు.. అయితే, వైఎస్ జగన్.. తెనాలి పర్యటన పాలక-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఉదయం 11.15 గంటలకు తెనాలి ఐతానగర్ చేరుకోనున్నారు వైఎస్ జగన్.. అనంతరం ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్, అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు వైఎస్ జగన్..
Read Also: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ అమీతుమీ.. తొలి కల తీరేదెవరిదో!
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
తెనాలి సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువకులపై దాడి చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల.. అయితే, రాజకీయ లబ్ధికోసం విద్వేషాలు రాజేస్తున్నారంటూ వైఎస్ జగన్పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. మరోవైపు, జగన్ తెనాలి పర్యటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్.. తెనాలికి వెళ్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాగా, గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేయడం.. ఆ తర్వాత వారిని పట్టుకుని రోడ్డుపైనే పోలీసులు లాఠీలతో అరికాళ్లపై కొట్టడం చర్చగా మారింది.. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. పోలీసుల చర్యలను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారని, ఒక స్టెప్ ఫార్వాడ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తారన్నారు.. పోలీసుల్ని కొంత పనిచేసుకోనివ్వాలని అని వ్యాఖ్యానించారు హోంమంత్రి అనిత..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!