Union Minister Murugan: ఢిల్లీలో జగన్ ధర్నాపై కేంద్రమంత్రి సంచనల వ్యాఖ్యలు..
- వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాపై కేంద్ర మంత్రి మురుగన్ సంచలన వ్యాఖ్యలు..
- ఎన్డీఏ గెలుపును వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపాటు..
- ఎన్డీఏ గెలుపును తట్టుకోలేక ఢిల్లీలో జగన్ డ్రామాలు ఆడారని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Murugan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా చేసిన ధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. ఎన్డీఏ గెలుపును వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు.. ఎన్డీఏ గెలుపును తట్టుకోలేక ఢిల్లీకి వచ్చి జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.. డ్రామాలు ఆడుతున్న జగన్కు ఇండియా కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని దుయ్యబట్టారు.. ఇక, నిబంధనల ప్రకారం చూస్తే వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రాదు… నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదాకు అర్హత లేకుంటే ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు..
Read Also: Tihar Jail: తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు..!
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. నీట్ పరీక్షలను వద్దని తమిళనాడు ప్రభుత్వం అనడం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అన్నారు మురుగన్.. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని వ్యతిరేకించడం కోసమే నీట్ ను తప్పు పడుతున్నాయన్న ఆయన.. నీతిఆయోగ్ సమావేశానికి స్టాలిన్ ఎందుకు వెళ్లలేదు..? అని ప్రశ్నించారు. తమిళనాడు అభివృద్ధిని స్టాలిన్ పట్టించుకోవడం లేదు.. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా తమిళనాడు అభివృద్ధి కోసం కావాల్సిన ప్రతిపాదనలు ఎలా పెట్టగలరు..? అని మండిపడ్డారు.. కేంద్రం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకం కింద ఏపీకి లబ్ధి పొందవచ్చు అన్నారు.. విద్యుత్ ఛార్జీల భారం తగ్గుదలకు సూర్య ఘర్ పథకం ఉపకరిస్తుందన్న ఆయన.. రైల్వేల ద్వారా రూ. 9151 కోట్లు ఏపీకి రానున్నాయి. ఏపీలో 41 రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి అన్నారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం. 2047లో భారత్ గ్లోబల్ లీడరుగా అవతరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.. బడ్జెట్టులో ఏపీకి, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చాం. ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!