Union Minister Murugan: ఢిల్లీలో జగన్ ధర్నాపై కేంద్రమంత్రి సంచనల వ్యాఖ్యలు..
- వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాపై కేంద్ర మంత్రి మురుగన్ సంచలన వ్యాఖ్యలు..
- ఎన్డీఏ గెలుపును వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపాటు..
- ఎన్డీఏ గెలుపును తట్టుకోలేక ఢిల్లీలో జగన్ డ్రామాలు ఆడారని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Murugan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా చేసిన ధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. ఎన్డీఏ గెలుపును వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు.. ఎన్డీఏ గెలుపును తట్టుకోలేక ఢిల్లీకి వచ్చి జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.. డ్రామాలు ఆడుతున్న జగన్కు ఇండియా కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని దుయ్యబట్టారు.. ఇక, నిబంధనల ప్రకారం చూస్తే వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రాదు… నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదాకు అర్హత లేకుంటే ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు..
Read Also: Tihar Jail: తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు..!
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
మరోవైపు.. నీట్ పరీక్షలను వద్దని తమిళనాడు ప్రభుత్వం అనడం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అన్నారు మురుగన్.. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని వ్యతిరేకించడం కోసమే నీట్ ను తప్పు పడుతున్నాయన్న ఆయన.. నీతిఆయోగ్ సమావేశానికి స్టాలిన్ ఎందుకు వెళ్లలేదు..? అని ప్రశ్నించారు. తమిళనాడు అభివృద్ధిని స్టాలిన్ పట్టించుకోవడం లేదు.. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా తమిళనాడు అభివృద్ధి కోసం కావాల్సిన ప్రతిపాదనలు ఎలా పెట్టగలరు..? అని మండిపడ్డారు.. కేంద్రం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకం కింద ఏపీకి లబ్ధి పొందవచ్చు అన్నారు.. విద్యుత్ ఛార్జీల భారం తగ్గుదలకు సూర్య ఘర్ పథకం ఉపకరిస్తుందన్న ఆయన.. రైల్వేల ద్వారా రూ. 9151 కోట్లు ఏపీకి రానున్నాయి. ఏపీలో 41 రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి అన్నారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం. 2047లో భారత్ గ్లోబల్ లీడరుగా అవతరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.. బడ్జెట్టులో ఏపీకి, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చాం. ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!