Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు సవాల్ ఏడ్చినట్లుగా వుంది.. దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడు..!
- జగన్ అసెంబ్లీ హాజరుపై బాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది..
- చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి..
- ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.. అసలు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? అని ప్రశ్నించారు.. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తాం… మీ మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానాలు చెప్పటానికి జగన్ ఒక్కరు చాలు అన్నారు.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. అయితే, జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు సమస్యలు చెప్పడానికి వస్తున్నారని తెలిపారు..
Read Also: Pawan Kalyan : చిరంజీవి వద్దన్న మూవీలో నటించిన పవన్.. చివరకు
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
చంద్రబాబు, లోకేష్ కు అభిమానులు ఉండరు.. ఇక్కడ జగన్ ని కలవడానికి వేల మంది వస్తున్నారు. చంద్రబాబు ముప్పై ఏళ్ల సీఎం అంటే ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచారనే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు వెన్నుపోటుపై సంబరాలు చేసుకోవాలని సలహా ఇచ్చారు సజ్జల.. అత్యధిక మెజార్టీ గెలిచిన ఎన్టీఆర్ ని దింపేశారు. చంద్రబాబు పదవి కోసం కుటుంబ సభ్యులను ఎలా మేనేజ్ చేశారో తెలుసన్నారు.. కోర్టులను చంద్రబాబు మేనేజ్ చేశారని విమర్శించారు.. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇస్తామని స్పీకర్ ఒక మాట చెబితే చాలు.. అయినా స్పీకర్ బూతుల్లో ఎక్స్పర్ట్.. ఆయన ప్రజా స్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు.. అసెంబ్లీకి దమ్ము ఉంటే రా అని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అంటున్నారో అర్ధం కావడం లేదన్న సజ్జల.. రైతులు యూరియా కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం రైతులు వందల మంది చెప్పులు పెట్టి లైన్ లో వుంటున్నారు. కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వెంట పడి కొడతారని హెచ్చరించారు.. చంద్రబాబు మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారు. ఆయనకు ప్రజల దగ్గరకి వెళ్లాలి అంటే భయం ఉంది.. ఇటీవల ఆయన కార్యక్రమాలు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలోనే ఉంటున్నాయని వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!