Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan Education Qualification: దేశంలో నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు మరింత ముమ్మరమయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్న తర్వాతే దేనిపైనైనా చర్చ జరుగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో వివాదంలో చిక్కుకున్న విద్యాశాఖ మంత్రి విద్యా అర్హతలు, ఆయన నేపథ్యంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చాలా మంది యువత గూగుల్లో ప్రస్తుతం దేశ విద్యాశాఖ మంత్రి విద్యా్ర్హతల గురించి సెర్చ్ చేస్తున్నారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువుకున్నారు? ఆయన నేపథ్యంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ధర్మేంద్ర ప్రధాన్ విద్యాభ్యాసానికి వస్తే, ఆయన ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న ప్రముఖ ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీ (మానవశాస్త్రం)లో 1990లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A.) విద్యనభ్యసించారు. ఇక, 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే చురుకైన రాజకీయ అభిరుచి కలిగిన ఆయన, 1983లో తాల్చేర్ కాలేజీలో హయ్యర్ సెకండరీ చదువుతున్న సమయంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985లో తాల్చేర్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, తదనంతరం విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన 1993లో ఏబీవీపీ ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, 1995లో జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998 డిసెంబర్ 9న వివాహం చేసుకున్న ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అదే సంవత్సరంలో ఆయన అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 2024 జూన్ నుంచి దేశ విద్యాశాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.
Also Read
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
ఇక, ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఆయన వద్ద సుమారు రూ.7 కోట్ల (రూ.6,92,19,190) నికర ఆస్తులు ఉన్నాయి. దీనితో పాటు దాదాపు రూ.53 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. ఆయన పేరిట ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.20.5 లక్షల విలువైన వ్యవసాయేతర భూమితో పాటు, ఢిల్లీకి సమీపంలోని ఘాజియాబాద్ అహింసా ఖండ్లో రూ.2 కోట్ల విలువైన ఒక ప్లాట్ కూడా ఉంది.
తాజావార్తలు
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!