AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అమరావతి సచివాలయానికి చేరుకోనున్నారు.. ఇక, కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానుంది.. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన 25కి పైగా కీలక ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
యూఏఈతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, పరస్పర సహకారంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశముంది. అలాగే ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కొందరు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. విమానాశ్రయానికి విస్తృత ప్రచారం కల్పించాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
Also Read
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో APPSC, APSLPRB ద్వారా 3,168 ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే 50 ఏళ్లలోపు చేనేత కార్మికుల కోసం ‘నేతన్న భరోసా’ పథకానికి ఆమోదం తెలిపి, ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనను పరిశీలించనున్నారు. వంశధార నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.641.10 కోట్ల ప్రతిపాదన, హంద్రీ-నీవా ఫేజ్-2 వ్యయాన్ని రూ.312 కోట్లకు పెంచే ప్రతిపాదన, గోదావరి పుష్కరాల భద్రత కోసం రూ.50 కోట్ల మంజూరు అంశాలపై కూడా చర్చ జరగనుంది. బాపట్లలో వికలాంగుల డిగ్రీ కళాశాల ఏర్పాటు, రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.
అదే విధంగా విశాఖ, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో భూ కేటాయింపులు, అదానీ, గ్రీన్కో, AM గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, అనకాపల్లి VMRDA ల్యాండ్ పూలింగ్ రైతులకు పరిహారం, ఫైర్ సర్వీసుల ఆధునీకరణ, మార్క్ఫెడ్కు రూ.300 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ, విశాఖ జిల్లా ఎండాడలో AIG హాస్పిటల్స్కు 2.16 ఎకరాల భూమిని రూ.45.99 కోట్లకు కేటాయించే ప్రతిపాదనలపై కూడా మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!