Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: మరోసారి తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యా్‌ణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన పవన్‌.. అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతి వనంలోని మెమోరియల్ పార్క్‌ను సందర్శించారు.. పార్టీ సేవా గళం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య ప్రతినిధులతో కలిసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అనుబంధ సంస్థగా ఇటీవల ఏర్పాటు చేసిన ‘సేవా గళం’ కమిటీకి సంబంధించిన దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకే కాకుండా దేశంలో భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు మార్గదర్శకంగా నిలిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి మహనీయుడిని ఒకే కులానికి పరిమితం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన త్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు పడ్డాయని పేర్కొన్నారు.

రాజకీయాల్లో కులాల ప్రాధాన్యం ఎక్కువైంది..!
రాష్ట్ర రాజకీయాల్లో కులాల ప్రాధాన్యం అధికమైందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని విమర్శించకుండా మొత్తం కులాన్ని లక్ష్యంగా చేసుకుని దూషించడం ప్రమాదకర ధోరణి అని అన్నారు. కుల అంశాలను అత్యంత సున్నితమైన రాజకీయ ఆయుధంగా మార్చేశారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కుల రాజకీయాలు మరింత తీవ్ర స్థాయికి చేరాయని పవన్ ఆరోపించారు. జర్నలిస్టులను కూడా కులాల పేర్లతో దూషించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ విధానం కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు పరిపాలన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

×
×
Ad

అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే గెలుపు..
రాజకీయాలు ఏ ఒక్క కులంపైన ఆధారపడవని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే నాయకులు గెలుస్తారని పవన్ అన్నారు. అభివృద్ధి, ఉపాధి, నిరుద్యోగం, సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో కులాల చుట్టూ రాజకీయాలు తిరగడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతోందని, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు సమాజంలో వైరుధ్యాలను పెంచుతున్నాయని చెప్పారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే జనసేన పార్టీ ‘సేవా గళం’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తోందని పవన్ తెలిపారు. కులాలకు అతీతంగా సమాజ సేవ చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని వివరించారు. జనసేనలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారని, కుల రాజకీయాలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పార్టీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

తెలంగాణ అంటే నాకు అపారమైన ప్రేమ..
తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంపై తనకు అపారమైన ప్రేమ ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇటీవల తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో స్పందించిన ఆయన, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు ఉందని చెప్పారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. సమాజంలో కుల విభేదాలు తగ్గి సేవా భావం పెరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, పొట్టి శ్రీరాములు చూపిన త్యాగ మార్గమే అందరికీ ఆదర్శమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.