Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తూ, మంత్రులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో జరిగిన సమావేశంలో మంత్రులతో సీఎం ఈ విషయంపై చర్చించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థంగా వివరించడంలో మనం కొంత వెనుకబడ్డామని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ప్రభుత్వ పనులను వారికి తెలియజేయాలని, క్షేత్రస్థాయి పర్యటనలను మరింత పెంచాలని మంత్రులకు సూచించారు.…
AP Home Minister Anitha Health Update: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు స్వల్ప అస్వస్థత కలగడంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీపీ హెచ్చుతగ్గులు కనిపించడంతో సిబ్బంది జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. హోం మంత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవలి రోజులుగా తీవ్ర పని ఒత్తిడి ఉండటంతో అలసట కారణంగా ఈ అస్వస్థత ఏర్పడినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.…
AP Government: చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గత ఆరేళ్లుగా (2018 నుండి) పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా కేసులను పరిష్కరిస్తూ.. వాటికోసం నిధులను విడుదల చేసింది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించారు. Read Also: Mallojula Venugopal: “మావోయిస్ట్ పార్టీది ఇప్పుడు నిస్సహాయ స్థితి.. అందుకే బయటకు…
Maoist Threat Letters: మంత్రులకు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖలపై ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టత ఇచ్చింది. ఆ లేఖల్లో 99 శాతం ఫేక్ అని ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచ్ ఫోన్ నంబర్తో ఈ బెదిరింపు లేఖ పంపినట్లు గుర్తించినట్లు చెప్పారు. అయితే, ఇలా లేఖలు వచ్చిన విషయం ఆ సర్పంచ్కే తెలియదని వెల్లడించారు. ప్రత్యేకంగా నలుగురు మంత్రులకే ఈ లేఖలు రావడం వెనుక…
Jayamangala Venkataramana: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ లాబీల్లో చిట్చాట్ సందర్భంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.. తన రాజకీయ ప్రస్థానంపై మాట్లాడిన ఆయన, “నా దేవుడు ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే.. ఉదయం నిద్రలేవగానే ఆయన ఫోటోకు దండం పెడతాను.. ఈ మాటను ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను” అని అన్నారు. Read Also: Miss India- Miss Universe : టాలీవుడ్…
AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో చూడడం కాదు.. అసెంబ్లీకి వెళ్లి.. ప్రత్యక్షంగా మన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష నేతలు ఎక్కడ కూర్చుంటారు.. స్పీకర్ ఎటువైపు ఉంటారు? అసెంబ్లీలో సెక్యూరిటీ ఏంటి? అక్కడ ఉండే ఇతర సదుపాయాలు ఏంటి? అని ప్రత్యక్షంగా చూడడం.. తెలుసుకోవడం ఎవరికైనా ఇష్టమే.. అలాంటి అవకాశం విద్యార్థులకే వస్తే.. ఎగిరి గంతేస్తారు.. అయితే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం…
Ambati Rambabu 35 Quash Petitions: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై 35 క్వాష్ పిటిషన్ల విచారణను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయి. అయితే, అంబటి రాంబాబు వీటిని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు పోలీసులకు కీలక సూచనలు…
ఆంధ్రప్రదేశ్లో లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దిశగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన లభిస్తుండటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ కోర్సు కోసం దాదాపు 50 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని సీఎం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఏపీని క్వాంటం టెక్నాలజీ రంగంలో…
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. గత వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగా మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. ఇందులో భాగంగా ఆయన కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు…
AP Secretariat Security: రాజధాని అమరావతి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.. విజయవాడలో మావోయిస్టులు అరెస్టు అయిన నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భద్రతా సడలింపులు కుదరకుండా పోలీసులు మరింత కచ్చితమైన విధానంలో భద్రతను పెంచారు. సచివాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీస్ విభాగాలు ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగుల ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ భద్రత పెంపు.. ముఖ్యంగా, మావోయిస్టులు విజయవాడ…