RK Roja: ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ సందర్భంగా రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ, వైఎస్ జగన్మోన్ రెడ్డి మరియు ఆయన సతీమణి వైఎస్ భారతి కుటుంబ సమేతంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నారని తెలిపారు. అదే సమయంలో.. సీఎం చంద్రబాబు నాయడు, పవన్ కల్యాణ్ వంటి నేతలు ప్రజలతో కలిసి…
Janasena Party Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పాడేరు మండలం వంటల మామిడి పంచాయతీ పరిధిలోని నందిగరువు ఆదివాసి గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు…
పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ హీరో అవుతాడా లేక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా? ఒకవేళ హీరో అయితే అతన్ని ఎవరు లాంచ్ చేస్తారు? ఎవరి దర్శకత్వంలో అతను మొదటి సినిమా చేస్తాడు? అనే చర్చ ఇప్పటిది కాదు. సోషల్ మీడియాలో అకిరా నందన్ కటౌట్ చూసినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, అతనిపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో…
Deputy CM Pawan Kalyan: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దేవుడిపై భయం, ధర్మంపై గౌరవం ఉన్న సాధారణ హిందూ మనస్తత్వంలోని నిద్రావస్థ నుంచి, సౌకర్య భావన నుంచి మనం బయటకు రావాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎవరు మన హిందూ దేవుళ్లను అవమానించినా, మన ధర్మాన్ని ఎగతాళి చేసినా, మనం లోపలే బాధపడి, కర్మకు వదిలేసి, ముందుకు వెళ్లిపోతున్నాం అన్నారు.…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10.40కి సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి…
Janasena MLA Arava Sridhar Incident: మహిళా ఉద్యోగినిపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరుల నుంచి వివరాలు సేకరించనుంది.…
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పర్యటనను పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రత్యేంగా ఈసారి…
Pawan Kalyan: రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టాలను ఎదుర్కొందని, మళ్లీ రాష్ట్రం నష్టపోకుండా ఉండేందుకే తెలుగు జాతి ప్రయోజనాల కోసం కూటమిగా ఏకమయ్యామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన జలజీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్.. ఈ…
Deputy CM Pawan Kalyan: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తోన్న కీలక అడుగుకు శుభ ముహూర్తం ఖరారైంది. 3 వేల 50 కోట్ల రూపాయలతో చేపట్టే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. పెరవలిలోని ఎన్హెచ్ 216ఏ దగ్గర ఆర్కే రైస్ మిస్ సమీపంలో నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన…
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. పొంగుటూరు లక్కవరం మధ్య నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.…