PAC Chairman Election: పీఏసీ ఎన్నిక.. చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే..!
- నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్..
- సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్..
- టీడీపీ తరపున నామినేషన్లు వేసిన ఏడుగురు సభ్యలు..
- జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు నామినేషన్..
- బీజేపీ తరపున నామినేషన్ వేసిన విష్ణు కుమార్రాజు..
- వైసీపీ తరపున నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
- పీఏసీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఎన్నికయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAC Chairman Election: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కూడా… పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో… ఆసక్తి నెలకొంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగుతుంది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే… పీఏసీ ఛైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
Read Also: Maoist Attack: వాజేడులో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు..
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. వైసీపీ హయాంలో పీఏసీ ఛైర్మన్గా పయ్యావుల కేశవ్ పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో… పీఏసీ ఛైర్మన్ పదవికి తమకు ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ కూడా వేశారు. అయితే… ఆ పదవికి వైసీపీ దక్కే అవకాశం లేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా, చైర్మన్ కావాలన్నా… 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ… అసెంబ్లీలో వైసీపీకి సంఖ్యా బలం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో… పీఏసీ చైర్మన్ పదవి దక్కదని కూటమి నేతలు చెప్తున్నారు. దీంతో.. జనసేనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!