Andhra Pradesh: అమావాస్య ఎఫెక్ట్..! వెలవెల బోతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు..
- ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్..
- ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ ధరలను పెంచనున్న ప్రభుత్వం..
- గత రెండు రోజులుగా రద్దీగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు..
- రేపు అమావాస్య కావడంతో ఇవాళ, రేపు ప్రభావం..
- జనంలేక వెలవెలబోతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారతాయని అందరూ అనుకుంటారు.. కానీ, ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..
Read Also: Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
కాగా, జనవరి 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయనే ప్రచారం సాగింది.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగినా.. పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా వేసింది సర్కార్.. తాజాగా మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో భూముల విలువ 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రాజధాని అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ర్టేషన్ చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖ లాంటి తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ర్టేషన్ చార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం..
తాజావార్తలు
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
ట్రెండింగ్
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?