Andhra Pradesh: అమావాస్య ఎఫెక్ట్..! వెలవెల బోతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు..
- ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్..
- ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ ధరలను పెంచనున్న ప్రభుత్వం..
- గత రెండు రోజులుగా రద్దీగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు..
- రేపు అమావాస్య కావడంతో ఇవాళ, రేపు ప్రభావం..
- జనంలేక వెలవెలబోతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారతాయని అందరూ అనుకుంటారు.. కానీ, ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..
Read Also: Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
కాగా, జనవరి 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయనే ప్రచారం సాగింది.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగినా.. పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా వేసింది సర్కార్.. తాజాగా మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో భూముల విలువ 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రాజధాని అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ర్టేషన్ చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖ లాంటి తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ర్టేషన్ చార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం..
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?