Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. భారీ విజువల్స్, పాన్ ఇండియా కథనం, రామాయణ ఛాయలతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఇప్పుడు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వెల్లడించిన వివరాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అమెరికా పర్యటనలో పాల్గొన్న కీరవాణి మాట్లాడుతూ, సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సంగీతంపై పూర్తిస్థాయిలో పని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్కు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో సంగీతాన్ని పూర్తి చేయడానికి దాదాపు ఐదు నెలల సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. జనవరి 2027 నాటికి తన పని పూర్తవుతుందని, అనంతరం మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ఇక ఈ మూవీని ఏప్రిల్ 2027 నాటికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో బృందం పనిచేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కొనసాగుతుండగా, ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తన ప్రతి మూవీలో టెక్నికల్ ఎఫ్ఫెక్ట్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. అదే విధంగా ఈ మూవీలో కూడా ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడే విజువల్స్తో పాటు సౌండ్ డిజైన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇప్పుడు కీరవాణి ఐదు నెలల సమయం కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో, ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో సంగీతం కథలో భాగంగా మారిపోతుందనే పేరుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
Also Read
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
ఆడియో ఆల్బమ్ విషయంలో కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ‘సంచారి’ అనే పాట మాత్రమే విడుదల కాగా, మిగతా పాటలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సింగిల్కు మంచి స్పందన రావడంతో, తదుపరి పాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. భారీ తారాగణం, కీరవాణి సంగీతం, రాజమౌళి విజన్ కలిసిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మరో సంచలనంగా నిలవబోతోంది.
తాజావార్తలు
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?