Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. భారీ విజువల్స్, పాన్ ఇండియా కథనం, రామాయణ ఛాయలతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఇప్పుడు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వెల్లడించిన వివరాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అమెరికా పర్యటనలో పాల్గొన్న కీరవాణి మాట్లాడుతూ, సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సంగీతంపై పూర్తిస్థాయిలో పని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్కు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో సంగీతాన్ని పూర్తి చేయడానికి దాదాపు ఐదు నెలల సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. జనవరి 2027 నాటికి తన పని పూర్తవుతుందని, అనంతరం మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ఇక ఈ మూవీని ఏప్రిల్ 2027 నాటికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో బృందం పనిచేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కొనసాగుతుండగా, ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తన ప్రతి మూవీలో టెక్నికల్ ఎఫ్ఫెక్ట్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. అదే విధంగా ఈ మూవీలో కూడా ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడే విజువల్స్తో పాటు సౌండ్ డిజైన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇప్పుడు కీరవాణి ఐదు నెలల సమయం కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో, ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో సంగీతం కథలో భాగంగా మారిపోతుందనే పేరుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
Also Read
- NEET UG Protest: విద్యార్థులు అరచి గెలిచారు.. నీట్ ఉద్యమంపై టాలీవుడ్ అగ్రతారల గొంతు మూగబోయిందా ?
- Dhanush: 'రాయన్' అవార్డుపై ధనుష్ స్పందన.. 'మెయ్యళగన్' మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!
- Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన 'లెనిన్' హీరోయిన్
- NTR Dragon: యూరప్లో కాదు.. ఆర్ఎఫ్సిలో యాక్షన్ రచ్చ! ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం భారీ సెట్
ఆడియో ఆల్బమ్ విషయంలో కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ‘సంచారి’ అనే పాట మాత్రమే విడుదల కాగా, మిగతా పాటలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సింగిల్కు మంచి స్పందన రావడంతో, తదుపరి పాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. భారీ తారాగణం, కీరవాణి సంగీతం, రాజమౌళి విజన్ కలిసిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మరో సంచలనంగా నిలవబోతోంది.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
-
Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
-
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
-
Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
-
Raja Muthupandi: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్లిఫ్టింగ్లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!