MLA Quota MLC elections: నేడు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. అసంతృప్తులకు బుజ్జగింపులు..!
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
- ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధిష్టానం..
- నేడు నామినేషన్ దాఖలు చేయనున్న టీడీపీ అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Quota MLC elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో టీడీపీ మూడు, జనసేన, బీజేపీ చెరో ఒకటి ఎమ్మెల్సీ స్థానాలు తీసుకుంటున్నాయి.. ఐదు స్థానాలు అధికార కూటమికి రావడంతో వైసీపీ నుంచి పోటీ లేదు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సహించడంలో భాగంగా అభ్యర్థులు ఎంపిక జరిగింది.. ఈసారి ఎమ్మెల్సీ స్థానాలకు చాలామంది ఆశావహులు ఉన్నారు.. ఇంచుమించుగా పాతిక నుంచి 30 మంది వరకు పోటీలో ఉన్నారు.. కానీ, ముగ్గురికిమాత్రమే అవకాశం ఉంది.. తమకు వస్తుందని ఆశించి రానివారంతా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పిఠాపురం వర్మ ఈసారి. ఖాయంగా ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నారు. కానీ, రాలేకపోయేటప్పుటికీ అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేవినేనిఉమా, బుద్ద వెంకన్న, జవహర్, పీతల సుజాత, మోపిదేవి వెంకటరమణ ఇలా చాలా మంది ఆశించారు.. కానీ, ఎవరికీ అవకాశం రాలేదు..
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందరికీ ఫోన్ చేసి ఏ కారణం వల్ల ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నారు అనేది వివరించారు. వచ్చే కోటాలో 20కి పైగా ఖాళీలు ఉంటాయని అప్పుడు తప్పనిసరిగా అవకాశం ఉంటుందని చెప్పారు.. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ మాట చెప్పమన్నారు అని కూడా వివరించారు. అయినప్పటికీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఖాళీలు తక్కువగా ఉండటంతో తప్పని పరిస్థితి ఏర్పడింది..
Read Also: Champions Trophy: భారత్ గ్రాండ్ విక్టరీ.. అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్..
అయితే, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి యువ మహిళ కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా పోరాటాలు చేశారు అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. టికెట్ రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. బీద రవిచంద్ర కూడా ఇదే పరిస్థితి పార్టీకి అంటిపెట్టుకొని ఉండి టికెట్ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురైనా సర్దుకుని పోయారు.. సర్దుకుని వెళ్లారు దీంతో ఎమ్మెల్సీ స్థానం ఆశించారు. ఆశించినట్టుగానే చంద్రబాబు న్యాయం చేశారు. బీటీ నాయుడు కూడా రెన్యువల్ కావాలని అడిగారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఉండి కుటుంబ సభ్యులకు.. పార్టీ నేతలకు ఎంతో నైతిక ధైర్యం ఇచ్చారు. అందుకే చంద్రబాబు తిరిగి రెన్యువల్ చేసినట్టు సమాచారం.. మొత్తానికి ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ అది కూడా మహిళకి చంద్రబాబు అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు ఈరోజు నామినేషన్ అయినా వేయనున్నారు..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..