WhatsApp Governance: అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!
- ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం..
- "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి ఈ తరహా సేవలు..
- వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది.. ఏపీ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ప్రజలకు మొదటి దశలో 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. రెవెన్యూ, దేవాదాయ శాఖ, సీఎంఆర్ఎఫ్.. ఇలా మొత్తంగా “మన మిత్ర” ద్వారా 161 రకాల సేవలను పౌరులకు అందుబాటులో ఉంటాయని.. వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.. రెండో దశలో 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఇక ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనుంది.. ఒకేముందు.. 95523 00009ను సేవ్ చేసుకోండి.. మీకు కావాల్సిన సేవను అందుకోండి..
Read Also: Jio Recharge Offer: త్వరపడండి.. 200 రోజులకు 500GB డేటా
Also Read
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఇక, వాట్సాప్ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పరిపాలన సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. యువగళం పాదయాత్రలో నే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చిందన్నారు.. బటన్ నొక్కితే భోజనం, సినిమా వచ్చినపుడు.. పాలన ఎందుకు రాకూడదు..? ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనేది మా ఉద్దేశం అన్నారు.. ఊరు నుంచి ఇంకో ఊరు పాదయాత్రలో వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ ల కోసం మమ్మల్ని తిప్పద్దు అని చాలా మంది అడిగారు.. గత ఐదేళ్లలో సర్టిఫికెట్ కుడి కొన్ని సందర్భాల్లో రాలేదు. దుగ్గిరాల మండలం లో ఎంపీటీసీ పోటీ చేస్తే గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. సర్టిఫికెట్ కోసం ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశమని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..