Jio Recharge Offer: త్వరపడండి.. 200 రోజులకు 500GB డేటా
- 200 రోజులకు 500GB డేటా అందించనున్న జియో.
- న్యూఇయర్ సందర్బంగా రూ.2025 రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించిన జియో.
- జనవరి 31 వరకే ఈ ప్లాన్ అందుబాటులో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Recharge Offer: రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో కంపెనీ ప్రత్యేకంగా రూ.2025 రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది. ఈ ప్లాన్లో 200 రోజుల వ్యాలిడిటీతో పాటు 500GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 31, 2025తో ఈ ప్రత్యేక ప్లాన్ ముగుస్తుంది. ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్.
Also Read: Andhra Pradesh: అవి పులులు కాదు.. పిల్లులు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఇక రూ.2025 ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 200 రోజులు కాగా.. 5G వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. ఇక 4G యూజర్లకు రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 200 రోజుల్లో మొత్తం 500GB డేటా వస్తుంది. ఇక ఈ ప్లాన్ లో వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు పంపించుకోవచ్చు కూడా .
ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. జియో సినిమా (ప్రీమియం కంటెంట్ మినహా), జియో టీవీ, జియో క్లౌడ్, రూ.2,150 విలువైన కూపన్లు లభిస్తాయి. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు జియో అదనంగా కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ కూపన్లను కూడా అందిస్తోంది. ఇందులో ప్రధానంగా రూ.500 Ajio కూపన్ (రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్పై వర్తింపు), రూ.150 స్విగ్గీ డిస్కౌంట్ (రూ.499 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై), రూ.1,500 విమాన టిక్కెట్ తగ్గింపు (ఈజ్మైట్రిప్ ద్వారా బుకింగ్లపై) లభిస్తాయి.
Also Read: Virat Kohli: ఫీల్డ్లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని.. వీడియో వైరల్
ఈ ప్రత్యేక ఆఫర్ చాలా తక్కువ కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వినియోగదారులు జనవరి 31, 2025లోపు రీఛార్జ్ చేసుకోవాలి. ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరోవైపు జియో తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన రెండు ప్లాన్లను కంపెనీ తొలగించింది. రూ.189 ప్లాన్, రూ.479 ప్లాన్ లను నిలిపి వేసింది. జియో వినియోగదారులకు 2025 న్యూ ఇయర్ స్పెషల్గా భారీ ఆఫర్ను అందించడంతో పాటు కొన్ని ప్లాన్లను తొలగించడం మిశ్రమ స్పందనను తెచ్చింది. కొత్త ప్లాన్తో ఎక్కువ డేటా, ఎక్కువ కాలం ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ చిన్న మొత్తంలో ప్లాన్లను ఉపయోగించే వారికి ఇది కొంత అసంతృప్తిని కలిగించవచ్చు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..