Minister Nara Lokesh: రెడ్ బుక్పై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. అది మ్యాండేటరీ..!
- రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్..
- రెడ్బుక్ మాకు మ్యాండేటరీ అంటున్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్.. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఫేక్ సర్టిపికెట్లతో అగ్రిగోల్డ్ భూములను కొట్టేశాడని ఆరోపించారు.. రేపు లిక్కర్, ఇసుక దందాల మీదా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఇది నేను ఊరూరా చెప్పా.. ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. మాకు అధికారం ఇచ్చారు అన్నారు.. అయితే, రెడ్బుక్పై జరుగుతోన్న చర్చపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. రెడ్బుక్ మాకు మ్యాండేటరీ అన్నారు..
Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్స్టార్..
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
గత ప్రభుత్వంలో చట్టాలని ఉల్లంఘించి, టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారు.. వాళ్లని మాత్రం వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. జోగి రమేష్ కుమారుడు ఏం చేశారు? ప్రజలు తెలుసుకోవాలన్న ఆయన.. అగ్రిగోల్డ్ భూముల పత్రాలకు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి.. ఆ భూములను అమ్మేశారు.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు.. భవిష్యత్లో ఇసుక పాలసీపై కూడా యాక్షన్ తీసుకుంటాం అన్నారు.. లిక్కర్ స్కాంపై కూడా చర్యలు తీసుకుంటాం.. అన్నారు. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తూ ఉంటే, మేమేం పట్టించుకోకూడదా..? అని ప్రశ్నించారు. నేను పాదయాత్ర చేసే సమయంలో రెడ్ బుక్ పట్టుకుని, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడాను.. చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటానని, అందుకే ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని తెలిపారు..
Read Also: Team India Schedule: టీమిండియా బిజీ షెడ్యూల్.. 5 నెలల్లో ఏకంగా..?
మరోవైపు.. జగన్ సైకోనే కాదు.. ఫేక్ కూడా అంటూ ఎద్దేవా చేశారు.. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమైంది? అని ప్రశ్నించిన మంత్రి లోకేష్.. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉంది.. బాధపడిన దళిత యువకులు జగన్ పేరును పీకేశారు.. కానీ, ఒక ఇటుక విరగలేదు.. ఇంకేం కాలేదు.. దానికి గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టింది ఎవరు జగన్ మోహన్ రెడ్డి కదా? అని ప్రశ్నించారు.. పేరు పెట్టుకుంది ఎవరు? జగన్ కాదా? అని నిలదీశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!