Minister Nara Lokesh: రెడ్ బుక్పై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. అది మ్యాండేటరీ..!
- రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్..
- రెడ్బుక్ మాకు మ్యాండేటరీ అంటున్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్.. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఫేక్ సర్టిపికెట్లతో అగ్రిగోల్డ్ భూములను కొట్టేశాడని ఆరోపించారు.. రేపు లిక్కర్, ఇసుక దందాల మీదా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఇది నేను ఊరూరా చెప్పా.. ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. మాకు అధికారం ఇచ్చారు అన్నారు.. అయితే, రెడ్బుక్పై జరుగుతోన్న చర్చపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. రెడ్బుక్ మాకు మ్యాండేటరీ అన్నారు..
Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్స్టార్..
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వంలో చట్టాలని ఉల్లంఘించి, టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారు.. వాళ్లని మాత్రం వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. జోగి రమేష్ కుమారుడు ఏం చేశారు? ప్రజలు తెలుసుకోవాలన్న ఆయన.. అగ్రిగోల్డ్ భూముల పత్రాలకు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి.. ఆ భూములను అమ్మేశారు.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు.. భవిష్యత్లో ఇసుక పాలసీపై కూడా యాక్షన్ తీసుకుంటాం అన్నారు.. లిక్కర్ స్కాంపై కూడా చర్యలు తీసుకుంటాం.. అన్నారు. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తూ ఉంటే, మేమేం పట్టించుకోకూడదా..? అని ప్రశ్నించారు. నేను పాదయాత్ర చేసే సమయంలో రెడ్ బుక్ పట్టుకుని, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడాను.. చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటానని, అందుకే ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని తెలిపారు..
Read Also: Team India Schedule: టీమిండియా బిజీ షెడ్యూల్.. 5 నెలల్లో ఏకంగా..?
మరోవైపు.. జగన్ సైకోనే కాదు.. ఫేక్ కూడా అంటూ ఎద్దేవా చేశారు.. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమైంది? అని ప్రశ్నించిన మంత్రి లోకేష్.. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉంది.. బాధపడిన దళిత యువకులు జగన్ పేరును పీకేశారు.. కానీ, ఒక ఇటుక విరగలేదు.. ఇంకేం కాలేదు.. దానికి గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టింది ఎవరు జగన్ మోహన్ రెడ్డి కదా? అని ప్రశ్నించారు.. పేరు పెట్టుకుంది ఎవరు? జగన్ కాదా? అని నిలదీశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల ఏం జట్టుకు ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!