కొండ ప్రాంత రాజకీయాల్లో కీలక మలుపు. ఆధిపత్య పోరులో అసలైన కుదుపు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్గత పోరుకు ముగింపు పలుకాలన్న ఉద్దేశ్యంతో.. అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది అధిష్టానం.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ తర్వాత రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉండొద్దు.. స్వచ్ఛంధ్రాలో అనకాపల్లి 13వ స్థానంలో ఉంది.. ర్యాంకింగ్ మెరుగుపడాలని సూచించారు. అలాగే, నాతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీల పని తనాన్ని పరిశీలిస్తున్నాను.. సమర్ధవంతంగా ఎలా పని చేయించాలో నాకు తెలుసు.. ఎవరినీ వదిలిపెట్టను అన్నారు.
Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని…
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్తో వన్ టూ వన్ సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న (ఆన్ గోయింగ్) ప్రాజెక్టుల వివరాలపై పవన్ కల్యాణ్…
ఆ జిల్లాలో టీడీపీ సీనియర్స్ అయోమయంలో ఉన్నారా? మింగలేక, కక్కలేక సతమతం అవుతున్నారా? ఫ్రస్ట్రేషన్లో కొంతమంది పక్క చూపులు కూడా చూస్తున్నారన్నది నిజమేనా? అసలేంటి వాళ్ళకొచ్చిన సమస్య? అధికార పార్టీలో ఉండి కూడా మారిపోవాలనే ఆలోచన వచ్చేంత తీవ్రమైన పరిస్థితులు ఏమున్నాయి? అసలు ఏ జిల్లాలో ఉందా వాతావరణం?. పార్వతీపురం మన్యం జిల్లాలో పసుపు యుద్ధం పీక్స్కు చేరుతోంది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా టీడీపీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇక్కడ…
Kusuma Krishnamurthy: తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. కృష్ణమూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ…
Off The Record: పార్టీ ప్రతినిధులు కాదు. ప్రజా ప్రతినిధులు అంతకంటే కాదు. ఎవరూ ఎవర్నీ ప్రోత్సహించినట్టు కనిపించలేదు. కానీ…. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది సోషల్ మీడియాలో, బయటా తెగ చెలరేగిపోయారు. కనీసం వైసీపీ ప్రాధమిక సభ్యత్వం లేని వాళ్ళు కూడా పార్టీకి తామే బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్టు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. జగన్ అభిమానులం, వైసీపీ సానుభూతిపరులం అన్న ట్యాగ్ లైన్స్తో… అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా……
YS Jagan: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేయగా.. పీపీపీ మోడ్ అంటే.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు చేసి.. కోటి సంతకాల సేకరణ చేపట్టింది.. ఇక, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి…
Vidadala Rajini: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని.. వైసీపీని వీడేందుకు సిద్ధం అవుతున్నారని.. త్వరలోనే ఆ పార్టీకి గుడ్బై చెబుతారని.. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ పెద్ద ప్రచారమే జరిగింది.. దీంతో, విడదల రజిని.. వైసీపీకి బైబై చెబితే.. ఏ పార్టీలో చేరతారు అనే ప్రచారం కూడా సాగింది.. అయితే, ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి విడదల రజిని.. బీసీ మహిళపై తప్పుడు ప్రచారం చేయడమే…
Minister Ramprasad Reddy: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిని జిల్లా ప్రధాన కేంద్రంగా కొనసాగిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ, ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ కృతజ్ఞతా ర్యాలీ మరియు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి…