Minister Anagani Satya Prasad: ఈ నెల 6 నుండి రెవెన్యూ సదస్సులు.. కలెక్టర్లకు కీలక సూచనలు
- ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు..
- జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్..
- కీలక సూచనలు చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్..
Minister Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.. అయితే, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ నెల 6వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్లకు కీలక సూచనలు ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని స్పష్టం చేశారు.. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా రెవెన్యూ సదస్సులు జరగాలని ఆదేశాలు జారీ చేశారు.. రెవెన్యూ సదస్సులను మొక్కుబడి కార్యక్రమంలా మార్చవద్దంటూ.. అధికారులకు హెచ్చరించారు.. రెవెన్యూ సదస్సులో భూ దురాక్రమణులు, 22a భూముల ఉల్లంఘన పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
Read Also: Varun Dhawan : కీర్తి సురేష్కు బాలీవుడ్ లో వేరే లెవల్ ఎంట్రీ
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, పేదలకు భవిష్యత్తు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు అనగాని.. గత ప్రభుత్వంలో క్షేత్రస్ధాయిలో భూ సమస్యలు సృష్టించారు.. ఆర్ధికంగా దోచుకునే పథకాలే తప్ప పేదవాడికి ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు.. 67 వేల గ్రీవెన్స్లు రెవెన్యూలోనే వచ్చాయి… గ్రీవెన్సులు అన్నీ అక్కడి సమస్యలు అక్కడికక్కేడే పరిష్కరించేలా రెవెన్యూ సదస్సు నిర్వహించాలన్నారు.. 2018 తరువాత మరల రెవెన్యూ సదస్సులు పెట్టలేదు.. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 17,500 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.. 22a కింద పెట్టిన వాటికి కూడా న్యాయం చేసేలా ఈ సదస్సుల్లో పరిష్కరిస్తాం అని స్పష్టం చేశారు.. అన్యాక్రాంతం అయిన వాటిని కూడా అసలు యజమానిని డిస్ప్లే చేసి రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తాం.. రెవెన్యూనే కాకుండా హౌసింగ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.. గత ప్రభుత్వం వారి కార్యకర్తలకే భూములిచ్చింది.. అర్హులై స్ధలాలు లేని వారికి భూములు, నూతన రేషన్ కార్డులు ఇచ్చేలా ఒకేదగ్గర పరిష్కరిస్తాం అన్నారు. లీజుకు తీసుకున్న వాటి వినియోగంపై ఒక నిర్ణయం రెవెన్యూ సదస్సులలో తీసుకుంటాం అన్నారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!