Minister Anagani Satya Prasad: ఈ నెల 6 నుండి రెవెన్యూ సదస్సులు.. కలెక్టర్లకు కీలక సూచనలు
- ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు..
- జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్..
- కీలక సూచనలు చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.. అయితే, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ నెల 6వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్లకు కీలక సూచనలు ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని స్పష్టం చేశారు.. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా రెవెన్యూ సదస్సులు జరగాలని ఆదేశాలు జారీ చేశారు.. రెవెన్యూ సదస్సులను మొక్కుబడి కార్యక్రమంలా మార్చవద్దంటూ.. అధికారులకు హెచ్చరించారు.. రెవెన్యూ సదస్సులో భూ దురాక్రమణులు, 22a భూముల ఉల్లంఘన పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
Read Also: Varun Dhawan : కీర్తి సురేష్కు బాలీవుడ్ లో వేరే లెవల్ ఎంట్రీ
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, పేదలకు భవిష్యత్తు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు అనగాని.. గత ప్రభుత్వంలో క్షేత్రస్ధాయిలో భూ సమస్యలు సృష్టించారు.. ఆర్ధికంగా దోచుకునే పథకాలే తప్ప పేదవాడికి ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు.. 67 వేల గ్రీవెన్స్లు రెవెన్యూలోనే వచ్చాయి… గ్రీవెన్సులు అన్నీ అక్కడి సమస్యలు అక్కడికక్కేడే పరిష్కరించేలా రెవెన్యూ సదస్సు నిర్వహించాలన్నారు.. 2018 తరువాత మరల రెవెన్యూ సదస్సులు పెట్టలేదు.. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 17,500 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.. 22a కింద పెట్టిన వాటికి కూడా న్యాయం చేసేలా ఈ సదస్సుల్లో పరిష్కరిస్తాం అని స్పష్టం చేశారు.. అన్యాక్రాంతం అయిన వాటిని కూడా అసలు యజమానిని డిస్ప్లే చేసి రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తాం.. రెవెన్యూనే కాకుండా హౌసింగ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.. గత ప్రభుత్వం వారి కార్యకర్తలకే భూములిచ్చింది.. అర్హులై స్ధలాలు లేని వారికి భూములు, నూతన రేషన్ కార్డులు ఇచ్చేలా ఒకేదగ్గర పరిష్కరిస్తాం అన్నారు. లీజుకు తీసుకున్న వాటి వినియోగంపై ఒక నిర్ణయం రెవెన్యూ సదస్సులలో తీసుకుంటాం అన్నారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!