YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల అంశం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీగా గత రెండేళ్లుగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తున్నామని జగన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తో పాటు మొత్తం 143 హామీల అమలు గురించి ప్రజలు కూడా సమాధానం కోరుతున్నారని అన్నారు.
“పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వెన్నుపోటు”
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదని జగన్ విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులు లేకపోయినా, 2015 ఫిబ్రవరిలో లీటర్కు రూ.4 చొప్పున పెట్రోలు, డీజిల్పై అదనపు భారం మోపారని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ, చంద్రబాబు పెంచిన దానికంటే కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచామని జగన్ పేర్కొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ తీవ్ర విమర్శలు చేశారని అన్నారు.
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
“ఇప్పటికే రూ.4 పెంచారు.. మరి రూ.8 తగ్గించాలి కదా?”
ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్పై ఉన్న పన్నులను తగ్గించి ధరలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారని అన్నారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్పై ఇప్పటికే రూ.4 వరకు అదనపు భారం పెరిగిందని ఆరోపించిన జగన్, “చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు లీటర్కు కనీసం రూ.8 తగ్గించాలి కదా?” అని ప్రశ్నించారు.
కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపణ
రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన పెట్రోలు, డీజిల్ కొరతపై కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల అవసరాలు తీర్చాల్సిన ముఖ్యమంత్రి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్లెట్ల నుంచి పెట్రోలు, డీజిల్ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. బల్క్లో డీజిల్ కొనుగోలు చేస్తే ధర రూ.150 పైగా ఉంటుందని, కానీ రిటైల్ ధర రూ.101 మాత్రమే ఉండటంతో కొందరికి లాభం చేకూర్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
కేంద్రం చీవాట్లు పెట్టిందన్న జగన్
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించిందని జగన్ తెలిపారు. రిటైల్ అవుట్లెట్ల నుంచి కమర్షియల్ అవసరాలకు ఇంధనం వాడకూడదని కేంద్రం స్పష్టం చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా సంక్షోభ సమయంలో కూడా స్కామ్లకు పాల్పడుతున్నారని ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!