Punganur Case: హైకోర్టులో ఎంపీ మిథున్రెడ్డికి ఊరట..
- ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో ఊరట..
- పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు..
- 2 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టుకు వైసీపీ ఎంపీ..
- మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punganur Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజంపేట లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.. ఇక, వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Fire Accident: షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం.. నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
కాగా, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం విదితమే.. పరస్పరం దాడులతో పుంగనూరులో విధ్వంసమే జరిగింది.. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి.. మరో ఫిర్యాదుతో మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై సెక్షన్ 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ నేతల ఫిర్యాదులతో టీడీపీ శ్రేణులపై కూడా కేసులు నమోదు చేసిన విషయం విదితమే.. పుంగనూరు పోలీసులు జులై 19 హత్యాయత్నం సహా రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జులై 18వ తేదీన పుంగనూరును కుదిపేసిన ఘటన నేపథ్యంలో ఈ కేసులు పెట్టారు.. రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి వచ్చిన సమయంలో కూటమి మరియు వైసీపీ క్యాడర్ మధ్య ఘర్షణలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందితో సహా 12 మందికి పైగా గాయాలపాలయ్యారు.. అనేక వాహనాలు ధ్వంసమైన విషయం విదితమే..
తాజావార్తలు
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!