Punganur Case: హైకోర్టులో ఎంపీ మిథున్రెడ్డికి ఊరట..
- ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో ఊరట..
- పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు..
- 2 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టుకు వైసీపీ ఎంపీ..
- మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punganur Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజంపేట లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.. ఇక, వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Fire Accident: షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం.. నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
కాగా, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం విదితమే.. పరస్పరం దాడులతో పుంగనూరులో విధ్వంసమే జరిగింది.. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి.. మరో ఫిర్యాదుతో మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై సెక్షన్ 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ నేతల ఫిర్యాదులతో టీడీపీ శ్రేణులపై కూడా కేసులు నమోదు చేసిన విషయం విదితమే.. పుంగనూరు పోలీసులు జులై 19 హత్యాయత్నం సహా రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జులై 18వ తేదీన పుంగనూరును కుదిపేసిన ఘటన నేపథ్యంలో ఈ కేసులు పెట్టారు.. రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి వచ్చిన సమయంలో కూటమి మరియు వైసీపీ క్యాడర్ మధ్య ఘర్షణలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందితో సహా 12 మందికి పైగా గాయాలపాలయ్యారు.. అనేక వాహనాలు ధ్వంసమైన విషయం విదితమే..
తాజావార్తలు
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
-
Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!