Perni Nani: ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు.. నాలుగుసార్లు సీఎంగా పనిచేసి కూడా..!
- సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు
- వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు- పేర్ని నాని
- కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్చగా బ్రతకాలని జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారు
- చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారు- పేర్ని నాని
- నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వల్ల రాష్ట్రానికి అప్పులు మిగిలాయి- పేర్ని నాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు.. కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్ఛగా బ్రతకాలని వైఎస్ జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు. జగన్ వ్యక్తిత్వ హననం చేయని రోజూ చంద్రబాబు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. పనామా లీక్స్, పారడైస్ పేపర్స్ అంటూ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా.. జగన్ను ప్రజలు సీఎం చేశారని తెలిపారు. జగన్కు 40 శాతం ఓటింగ్ రావటంతో దాన్ని ఎలాగైనా చంపాలని చంద్రబాబు అండ్ బ్యాచ్ రాక్షసులు విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.
Read Also: AP Assembly: పీఏసీ కొత్త చైర్మన్గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతి చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. సింగపూర్ హోటల్స్ వ్యవహారం గుర్తు తెలియదా..? సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్టు కూడా అయ్యారని గుర్తు లేదా అని అన్నారు. అదానీ.. జగన్ సమయంలో పెట్టుబడి పెడితే విష ప్రచారం, చంద్రబాబు సమయంలో అదానీ పెట్టుబడి పెడితే మాత్రం మంచిది అన్నట్టు ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ ప్రభుత్వం అంగీకరిస్తే కూడా విమర్శలు చేస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అని ఓట్లు అడిగి 17 వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు.
Read Also: TPCC Mahesh Goud : మోడీ వల్లే అదానీ దురాగతాలు పెరిగిపోతున్నాయి
నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వల్ల రాష్ట్రానికి అప్పులు మిగిలాయని పేర్ని నాని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో SEKI తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అదానీతో తాము ఒప్పందాలు చేసుకోలేదని విమర్శించారు. అమెరికా పోలీసులు అరెస్టు చేస్తే కేంద్రంలో అప్పట్లో ఉన్న మంత్రిని, సెకి చైర్మన్ను తీసుకు వెళ్తారు తప్ప జగన్కు ఏం సంబంధం..? అని పేర్ని నాని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!