TPCC Mahesh Goud : మోడీ వల్లే అదానీ దురాగతాలు పెరిగిపోతున్నాయి
- మోడీ వల్లే అదానీ దురాగతాలు పెరిగిపోతున్నాయి
- మోడీ అధికారంలోకి వచ్చాక ధనికుడు, పేదలు అనే వ్యత్యాసం పెరిగింది
- అమెరికా అదానీ కుంభకోణం బయటపడింది
- అర్హత లేకున్నా అదానీ కంపెనీలు రుణాలు పొందాయి
- అదానీ అరెస్టైతే మోడీ రాజీనామా చేయాల్సిందే
- అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలి. : టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడు.. పేదలు మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వల్లనే అదానీ దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా అదానీ కుంభకోణం బయట పడిందని, మన రాష్ట్రంలో కొంతమంది పెద్దలకు ముడుపులు అందాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. అర్హత లేకుండా అదానీ కంపనీ రుణాలు పొందిందని, అదానీ అరెస్టు ఐతే ప్రధాని మోడీ రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మోడీ వచ్చాకా.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి..? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం బాసటగా ఉండటం వల్లనే ఆస్తులు పెరిగాయని, అదానీ వ్యవహారం పై జేపీసీ వేయాలని మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్ కూడా స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఇస్తా అంటే తీసుకుంటామని, అదానీ వంద కోట్లు స్కిల్ యూనివర్సిటీ కి ఇచ్చారన్నారు.
Mumbai 26/11 attack: భారత్కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
Also Read
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నామని, మేం కుదుర్చుకున్న ఒప్పందం చట్ట విరుద్ధం ఐతే వెనక్కి తీసుకుంటామని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ జేపీసీ అడుగుతున్నారని మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్.. బీజేపీ వేరు కాదని, బీజేపీ.. బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని ఆయన అన్నారు. కేటీఆర్ కి సన్నిహిత ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్ లో ఉన్నారని, చాలా మంది క్యూ కడతారన్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి నీ చూసి పార్టీ లోకి రావాలని చూస్తున్నారని, అనర్హత వేటు నిర్ణయం స్పీకర్ పరిధి అని, చట్టం ప్రకారం వ్యవహరిస్తారన్నారు. ఎవరెవరు పార్టీలో చేరతారు అనేది త్వరలోనే తెలుస్తోందన్నారు మహేష్ గౌడ్.
Komatireddy Venkat Reddy : కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి
తాజావార్తలు
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!