Ambati Rayudu: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాసేపటి క్రితం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. అంబటి రాయుడును పార్టీలోకి సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే అంబటి రాయుడు గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగినప్పటికీ.. అధికారికంగా మాత్రం అంబటి రాయుడు పార్టీలో చేరలేదు. ఈరోజు ఆయన పార్టీలో చేరడంతో.. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Teacher Unions: సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు
ఇదిలా ఉంటే.. విద్యా రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులకు ఆకర్షితుడిని అయ్యి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాయుడు గతంలో ప్రకటించారు. నాడు-నేడు, స్పోర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవడం, పేద పిల్లలను పైకి తీసుకొచ్చే విషయంలో సీఎం జగన్ అత్యంత కృషి చేస్తున్నారని, ఆ విధానాలు నచ్చి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, జగన్ కు మద్దతుగా నిలుస్తానని గతంలో అంబటి రాయుడు చెప్పారు.
Read Also: Manchester Flight Incident: గాల్లో ఉన్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. 11 మందికి గాయాలు