Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Reviews Bc Welfare Department

CM Chandrababu: నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకే 34 శాతం.. సీఎం కీలక వ్యాఖ్యలు..

Published Date :December 23, 2024 , 6:46 pm
By Sudhakar Ravula
  • బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష..
  • నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు..
  • దీనిపై త్వరలో చట్టబద్ధత తెస్తామన్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu: నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకే 34 శాతం.. సీఎం కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టారు. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా లబ్ధి జరిగేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరికొంత కసరత్తు తరువాత…సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న హామీకి కట్టుబడి ఉన్నామని….దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని సీఎం తెలిపారు. దీనిపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్లేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారన్నారు. వీటిని పునరుద్ధరించేందుకు న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై సీఎం సమీక్షలో చర్చించారు. న్యాయపరంగా తిరిగి 34 శాతం రిజర్వేషన్లు పొందడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కోర్టు తీర్పులు పరిశీలించి…..న్యాయ పరంగా ముందుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు.

Read Also: Bengaluru: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం

Also Read

  • Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
  • AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
  • Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
  • School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు

బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలికల హాస్టళ్లు తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 11 వందలకు పైగా బీసీ విద్యార్థుల హాస్టళ్లు ఉన్నాయి.ప్రభుత్వ భవనాలు 660 ఉండగా, అద్దె భవనాలు 450 ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టిన రూ.110.52 కోట్ల డైట్ బిల్లుల్లో రూ.76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించగా రూ.34.14 కోట్లు పెండింగులో ఉన్నాయి…వాటిని కూడా చెల్లించాలని ఆదేశించారు. 2024-25 సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.135 కోట్లు కేటాయించింది. ఆగస్టు నాటికి కాస్మోటిక్ బిల్లులు కూడా రూ.20 కోట్లు పెండింగులో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.7.10 కోట్లు చెల్లించిందని సీఎం తెలిపారు.. విద్యార్థుల ట్రంక్ బాక్సులు, ఇతర వస్తువులకుగాను ప్రభుత్వం బడ్జెట్ లో రూ.18 కోట్లు కేటాయించింది. వీటిని త్వరలోనే ప్రభుత్వం కొనుగోలు చేసి విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు…డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల చెల్లింపు, ట్యూటర్ ఫీజు, హాస్టళ్ల మైనర్ రిపేర్లను వెంటనే పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు.

Read Also: FACT CHECK: “మద్యం తాగి రాజ్యాంగం రాశారు”.. కేజ్రీవాల్ వీడియో వైరల్

13 బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసింది. 5 వేల720 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించింది ప్రభుత్వం. త్వరలోనే ఆన్ లైన్ తరగతులు కూడా చేపట్టనున్నారు. సివిల్స్ కు ఏటా 100 మందికి శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సర్కిల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. సీఆర్డీఏ పరిధిలో 5 ఎకరాలను సివిల్ సర్వీస్ కోచింగ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. దీని కోసం ఇప్పటికే భవనానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం కాగా..500 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. 2014-19 మధ్య విదేశాల్లో చదువుకున్న బీసీ విద్యార్థులకు రూ.81.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం నిధులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. వీటి కోసం 2024-25 బడ్జెట్ లో రూ.36.11 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి జిల్లాల్లో 13 బీసీ భవనాల నిర్మాణాలకు 2016-17లో నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కో భవనం పూర్తికి రూ.5 కోట్లు ఖర్చు కానుండగా పెరిగిన ఖర్చుల నేపథ్యంలో రూ.10 కోట్లు కేటాయించాలని బీసీ నేతలు కోరుతున్నట్లు సమీక్షలో చర్చించారు. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు బీసి భవనాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మిగిలిన భవనాల నిర్మాణానికి ఇతర జిల్లాల్లో భూసేకరణ పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి చెప్పారు. బీసీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బడ్జెట్ లో రూ.896.79 కోట్లు కేటాయిచింది. రుణాల మంజూరుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గొర్రెల పెంపకం దారులకు అందించాల్సిన చేయూతపైనా సమీక్షలో చర్చ జరిగింది. అదే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం లో 13 జిల్లాల్లో కాపు భవన్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ. 2 కోట్ల చొప్పున కేటాయించేందుకు నిర్ణయించింది. అయితే వీటిలో 4 భవనాల నిర్మాణం ప్రారంభం కాగా గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. నిలిచిపోయిన 4 కాపు భవనాలను కూడా పూర్తి చేసేందుకు అవసరమైన రూ.5.40 కోట్ల విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 34 percent reservation
  • Andhra Pradesh
  • BC welfare department
  • BCs
  • cm chandrababu

తాజావార్తలు

  • GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన PBKS..

  • Karimnagar PMG Jewellery : పీఎంజీ జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!

  • Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

  • Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!

  • Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్‌కు సింపుల్‌గా నో చెప్పిన జలమండలి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions