Bengaluru: సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం
- బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్
- రూ.11.8 కోట్లు మాయం.. పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్లు హడలెత్తిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు సరికొత్త దురాగతాలకు పాల్పడుతున్నారు. వారి వలలో చిక్కుకుంటున్న ప్రజలు విలవిలలాడిపోతున్నారు. భయాందోళనకు గురై కోట్లాది రూపాయులు జార విడుచుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఒక సాప్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా రూ.11 కోట్లకుపైగా నగదు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు.
బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవంబర్ 11న ‘‘డిజిటల్ అరెస్ట్’’కు బలి అయ్యాడు. మోసగాళ్ళు పోలీసు అధికారులుగా మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కోసం బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని బెదిరింపులకు దిగారు. ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని మోసగాడు బెదిరించాడు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించాడు. వర్చువల్ విచారణకు సహకరించాలని లేదంటే అరెస్ట్లు తప్పవని తీవ్రంగా బెదిరించాడు. దీంతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 మధ్య దపదపాలుగా రూ.11.8 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు మళ్లించుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 11న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారిగా చెప్పుకునే వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన సిమ్ కార్డును అక్రమ ప్రకటనలు, వేధింపుల సందేశాలకు ఉపయోగించారని మోసగాడు బెదిరించాడని పేర్కొన్నారు. అనంతరం మనీలాండరింగ్ కోసం బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఆధార్ వివరాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారిగా చెప్పుకునే వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని ఎఫ్ఐఆర్లో బాధితుడు పేర్కొన్నాడు. స్కైప్ యాప్ను డౌన్లోడ్ చేయమని కోరుతూ మరొక వ్యక్తి నుంచి అతనికి కాల్ వచ్చింది. దాని తర్వాత ముంబై పోలీసు యూనిఫాం ధరించిన మరొక వ్యక్తి వీడియో-కాల్ చేసి ఒక వ్యాపారవేత్త ఆధార్ను ఉపయోగించి రూ. విలువైన లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంక్ ఖాతాను తెరిచాడని పేర్కొన్నాడు. రూ. 6 కోట్లు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మోసగాడు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించాడు. వర్చువల్ విచారణకు సహకరించకపోతే భౌతికంగా అరెస్టు చేస్తామని బెదిరించాడు. నవంబర్ 25న పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి అతనికి స్కైప్లో కాల్ చేసి కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని బెదిరించాడు. నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే కుటుంబాన్ని అరెస్టు చేస్తామని బెదిరించాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు. బాధితుడు అరెస్ట్కు భయపడి రూ.11.8 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత (BNS) ఐటీ చట్టం మరియు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!