Bengaluru: సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం
- బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్
- రూ.11.8 కోట్లు మాయం.. పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్లు హడలెత్తిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు సరికొత్త దురాగతాలకు పాల్పడుతున్నారు. వారి వలలో చిక్కుకుంటున్న ప్రజలు విలవిలలాడిపోతున్నారు. భయాందోళనకు గురై కోట్లాది రూపాయులు జార విడుచుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఒక సాప్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా రూ.11 కోట్లకుపైగా నగదు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు.
బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవంబర్ 11న ‘‘డిజిటల్ అరెస్ట్’’కు బలి అయ్యాడు. మోసగాళ్ళు పోలీసు అధికారులుగా మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కోసం బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని బెదిరింపులకు దిగారు. ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని మోసగాడు బెదిరించాడు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించాడు. వర్చువల్ విచారణకు సహకరించాలని లేదంటే అరెస్ట్లు తప్పవని తీవ్రంగా బెదిరించాడు. దీంతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 మధ్య దపదపాలుగా రూ.11.8 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు మళ్లించుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 11న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారిగా చెప్పుకునే వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన సిమ్ కార్డును అక్రమ ప్రకటనలు, వేధింపుల సందేశాలకు ఉపయోగించారని మోసగాడు బెదిరించాడని పేర్కొన్నారు. అనంతరం మనీలాండరింగ్ కోసం బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఆధార్ వివరాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారిగా చెప్పుకునే వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని ఎఫ్ఐఆర్లో బాధితుడు పేర్కొన్నాడు. స్కైప్ యాప్ను డౌన్లోడ్ చేయమని కోరుతూ మరొక వ్యక్తి నుంచి అతనికి కాల్ వచ్చింది. దాని తర్వాత ముంబై పోలీసు యూనిఫాం ధరించిన మరొక వ్యక్తి వీడియో-కాల్ చేసి ఒక వ్యాపారవేత్త ఆధార్ను ఉపయోగించి రూ. విలువైన లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంక్ ఖాతాను తెరిచాడని పేర్కొన్నాడు. రూ. 6 కోట్లు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మోసగాడు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించాడు. వర్చువల్ విచారణకు సహకరించకపోతే భౌతికంగా అరెస్టు చేస్తామని బెదిరించాడు. నవంబర్ 25న పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి అతనికి స్కైప్లో కాల్ చేసి కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని బెదిరించాడు. నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే కుటుంబాన్ని అరెస్టు చేస్తామని బెదిరించాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు. బాధితుడు అరెస్ట్కు భయపడి రూ.11.8 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత (BNS) ఐటీ చట్టం మరియు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!