Ganta Srinivasa Rao: పంచ గ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్
- పంచగ్రామాల ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం..
- బాధితులకు పట్టాలు పంపిణీ చేస్తామన్న గంటా శ్రీనివాసరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganta Srinivasa Rao: పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు గంటా శ్రీనివాసరావు.. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారన్నారు.. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలన్నీ పరిష్కరిస్తారన్నారు గంటా శ్రీనివాసరావు.
Read Also: Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
కాగా, విశాఖపట్నంలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అడివివరం, వెంకటాపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట గ్రామాలు అవే పంచ గ్రామాల పరిధిలో 11,282 ఎకరాల భూమి ఉంది. ఇందులో గతంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించాలని భావించి.. 2005లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. 2008లో మరోసారి పరిశీలన చేసి, 421.03 ఎకరాల్లో 12,149 నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా 547.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు 2014లో కలెక్టర్ ప్రభుత్వానికి లేఖరాశారు. ఈ ప్రత్యామ్నాయ భూమి ఆలయానికి ఇచ్చి, ఆ నిర్మాణాలు క్రమబద్ధీకరణకు 2015లో మంత్రివర్గం ఆమోదించింది. ఇక, దీనిపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు.. అలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో పడిన సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. దీనిపై ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగగా.. ఈ రోజు పంచ గ్రామాల సమస్యపై సమీక్ష నిర్వహిచారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.