Air Conditioners: ఏసీలు ఇలా వాడండి.. విద్యుత్ ఆదా చేయండి..!
- ఏసీల వినియోగంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కీలక సూచనలు..
- ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ ఆదా..
- ఏసీలను 24 డిగ్రీల వద్ద వాడితే 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్న బీఈఈ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Conditioners: ఎండలు దంచికొడుతున్నాయి.. అప్పుడప్పుడు అకాల వర్షాలతో కొంత వరకు వాతావరణం చల్లబడుతున్నా.. మళ్లీ ఎండలు మండిపోతున్నాయి.. దీంతో, ప్రజలు ఫ్యాన్ కింద సేదతీరే పరిస్థితి లేకుపోవడంతో.. కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. అయితే, ఏసీ ఉంది కదా? అని హై కూల్.. 18 డిగ్రీలు, 20 డిగ్రీలు వాడేశారంటే తప్పులే కాలేసినట్టే.. ఎండ నుంచి వచ్చి రాగానే ఏసీలు తక్కువ డిగ్రీల్లో వాడినా సమస్యలు తప్పవు.. మరోవైపు.. కరంట్ బిల్లు వాచిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.. మరి.. ఏసీలు ఎలా వాడాలి..? ఎన్ని డిగ్రీల వరకు ఏసీ వేసుకుని వాడితే మంచిదో కీలక సూచనలు చేసింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)..
Read Also: Osaka Expo 2025: ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
Also Read
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ఇళ్లతో పాటు, కార్యాలయలు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది అని వెల్లడించింది బీఈఈ.. ఏసీలను 24 డిగ్రీల వద్ద వాడితే 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పేర్కొంది.. ఇలా చేస్తే సంవత్సరంలో దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని.. దాని ద్వారా రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లు అవుతుందంటూ ఓ ప్రకటనలో వెల్లడించింది బీఈఈ.. అయితే, సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారని.. దీంతో విద్యుత్ భారం అదనంగా పడుతుందని తెలిపింది.. ఇక, హోటళ్లు, ఎయిర్పోర్ట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు పెడితే.. తద్వారా కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుందని.. దీంతో, ఏసీల జీవితకాలం కూడా పెరుగుతుందని కూడా పేర్కొంది.. ఈ విషయంలో విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించినట్టు పేర్కొంది బీఈఈ..
తాజావార్తలు
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!