Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన సర్కార్..
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..
- ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి లేదన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరేషన్పై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను ఇచ్చింది.. ఈ అంశానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతోంది… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకు వెళ్లారు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. ఈ రోజు మంత్రి డోలతో సమావేశమైన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.. డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగులు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నారని.. జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వాలన్నారు.. ఉద్యోగుల అనుభవం అర్హతలు బట్టి ఆయా శాఖల్లో నియమించాలన్నారు.. జాబ్ చార్ట్ తయారు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు ఉద్యోగులు..
Read Also: Murder : మేడ్చల్లో వరుస హత్యలు.. 24 గంటలలోపే మరో మర్డర్..
Also Read
- Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి"
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
ఇక, మల్టీ పర్పస్ అసిస్టెంట్ల.. ఆస్పిరేషనల్ అసిస్టెంట్లు అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను విభజించారని ఏ బాధ్యత అప్పగిస్తారో చెప్పాలన్నారు.. మహిళా పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు ఉద్యోగులు.. తమ ఉద్యోగాలు.. కొన్ని నాలుగు శాఖలతో సమన్వయం కలిగి ఉన్నాయని.. కనీసం ఒక రోజు సెలవు కావాలంటే నలుగురు అధికారులను కలవాల్సి ఉందన్నారు.. ఇదో పెద్ద సమస్యగా మారిందన్నారు ఉద్యోగులు.. దివ్యాంగులైన ఉద్యోగులను ఫీల్డ్ కు వెళ్లే బాద్యత తొలగించాలని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.. అయితే, ఉద్యోగుల సమస్యలు అన్ని వివరంగా విన్నామన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. ఈ నివేదిక ఆధారంగా రేషనలైజెషన్ పై నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి డోల బాల వీరాo జనేయ స్వామి. అధికారుల కమిటీ త్వరలోనే అన్ని విషయాలు చర్చించనుంది.. ఆ తర్వాత. రేషనైలేజేషన్ పై స్పష్టత రానుంది.. అసెంబ్లీలో ప్రభుత్వం ఇదే అంశం లో ప్రకటన చేసే అవకాశం ఉంది…
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో రేషనలైజెషన్ పై చర్చలు జరిపాం.. 35 ఉద్యోగ సంఘ నేతలు హాజరు అయ్యారని తెలిపారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను.. పీఆర్సీ లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో పెట్టమని కొందరు కోరారు.. శాఖలో మార్పు చెయ్యాలని తెలిపారు.. సాధ్యాసాధ్యాలపై ఆలోచించి ముందుకు వెళ్తాం.. వీలు అయినంత త్వరలో శాఖల కేటాయింపు జరుగుతుంది. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి లేదు.. త్వరలో అధికారులు తో కమిటీ ఏర్పాటు చేస్తాం. పని భారం పెరిగే అవకాశం ఉన్న ఉద్యోగుల విషయంలో కూడా స్వేచ్ఛ ఉంటుంది.. శాఖల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!