AP Liquor Shops: గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ
- గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయింపు..
- నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
- జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లకు ఎంపిక..
- ఒక షాపుకి ఫీజు రూ. 2 లక్షల నాన్ - రిఫండబుల్ మొత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది.. అందులో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, గీత కార్మికులకు 335 మద్యం షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లకు ఎంపిక చేయనున్నారు.. అభ్యర్థులు తమ కుల, నేటివిటీ ధ్రువపత్రాలు సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఒక షాపుకి ఫీజు 2 లక్షల రూపాయల నాన్ – రిఫండబుల్ మొత్తాన్ని నిర్ణయించారు.. ఒక అభ్యర్థి ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది.. కానీ, ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది.. ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. ఇక, రెండేళ్ల కాలానికి లైసెన్స్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..
Read Also: Somireddy Chandramohan Reddy: అర్హులైన వారికి ఇంటి స్థలాలు.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు..
Also Read
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో 3,396 షాపులకు లైసెన్సులు జారీ చేసింది ప్రభుత్వం.. అందులో 10శాతం ఇప్పుడు గీత కులాలకు కేటాయించనున్నారు.. అలా వచ్చే 340 షాపుల్లో నాలుగు షాపులు సొండి కులానికి విడిగా కేటాయిస్తారు. గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కుటుంబానికి ఒక షాపును కేటాయించనున్నారు. మిగిలిన 335 షాపులకు నోటిఫికేషన్ జారీ చేశారు.. ఇక, తిరుపతి జిల్లాలో అత్యధికంగా 23 షాపులు గీత కులాలకు కేటాయించారు. అల్లూరి సీతారామరాజు-1, అనంతపురం-14, శ్రీసత్యసాయి-9, అన్నమయ్య-11, చిత్తూరు-10, తూర్పు గోదావరి-13, కాకినాడ-16, కోనసీమ-13, బాపట్ల-12, గుంటూరు-13, పల్నాడు-13, కడప-14, కృష్ణా-12, ఎన్టీఆర్-11, కర్నూలు-10, నంద్యాల-11, నెల్లూరు-18, ప్రకాశం-18, పార్వతీపురం మన్యం-4, శ్రీకాకుళం-18, అనకాపల్లి-15, విశాఖపట్నం-14, విజయనగరం-16, ఏలూరు-14, పశ్చిమగోదావరి-18 షాపులు గీత కార్మికులకు కుటుంబాలకు కేటాయించింది ప్రభుత్వం..
తాజావార్తలు
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
ట్రెండింగ్
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!