Amaravati Capital: రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు సర్కార్ కీలక నిర్ణయం..
- అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై సర్కార్ కీలక నిర్ణయం..
- నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం..
- వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు..
Amaravati Capital: అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్ గా సాంకేతిక కమిటీని నియమించింది.. కమిటీలో సభ్యులుగా రహదారులు భవనాలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీప్ ఇంజనీర్లు ఉన్నారు.. ఇక, విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కూడా కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
Read Also: BMW 5 Series LWB: భారత్ మార్కెట్ లోకి వచ్చేసిన బిఎండబ్ల్యూ 5 సిరీస్..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.. దీంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై పూర్తిస్థాయిలో పరిశీలించి. వివిధ నిర్మాణాల పటిష్టత.. స్థితిగతులను తెలుసుకుని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది సాంకేతిక కమిటీ.. రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం, పైపులైన్లు తదితర అంశాలను కూడా సాంకేతిక కమిటీ పరిశీలించనుంది. కాగా, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణాలు జరిగాయి.. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు.. మరోవైపు.. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. మళ్లీ అమరావతి రాజధానిలో నిర్మాణలపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఆయా కట్టడాలను సీఎం చంద్రబాబు పరిశీలించిన విషయం విదితమే. మరోవైపు.. తాజాగా కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!