Amaravati Capital: రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు సర్కార్ కీలక నిర్ణయం..
- అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై సర్కార్ కీలక నిర్ణయం..
- నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం..
- వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital: అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్ గా సాంకేతిక కమిటీని నియమించింది.. కమిటీలో సభ్యులుగా రహదారులు భవనాలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీప్ ఇంజనీర్లు ఉన్నారు.. ఇక, విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కూడా కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
Read Also: BMW 5 Series LWB: భారత్ మార్కెట్ లోకి వచ్చేసిన బిఎండబ్ల్యూ 5 సిరీస్..
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.. దీంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై పూర్తిస్థాయిలో పరిశీలించి. వివిధ నిర్మాణాల పటిష్టత.. స్థితిగతులను తెలుసుకుని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది సాంకేతిక కమిటీ.. రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం, పైపులైన్లు తదితర అంశాలను కూడా సాంకేతిక కమిటీ పరిశీలించనుంది. కాగా, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణాలు జరిగాయి.. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు.. మరోవైపు.. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. మళ్లీ అమరావతి రాజధానిలో నిర్మాణలపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఆయా కట్టడాలను సీఎం చంద్రబాబు పరిశీలించిన విషయం విదితమే. మరోవైపు.. తాజాగా కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!